Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BJP : రైతుల సమస్యల పరిష్కారానికై రైతు సత్యాగ్రహం

— బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు

BJP : ప్రజాదీవెన నల్గొండ : రాష్ట్రంలో రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డిలు డిమాండ్ చేశారు.
రైతుల సమస్యల పరిష్కారం కోసం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట రైతు సత్యాగ్రహం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు డా.నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో వందల ఎకరాలు పంట నష్టం కలిగితే ఏ ఒక్కరోజు కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించలేదని విమర్శించారు.


రైతులు పండించిన వరి పంట ఎండిపోతే తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం మంత్రి పరామర్శించకపోవడం సిగ్గు చేయటానికి విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం రైతులకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను విస్మరించిందన్నారు.ప్రతి క్వింటాలు ధాన్యం 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి విస్మరించడం సిగ్గుచేటు అన్నారు. పూర్తిస్థాయిలో 2 లక్షల రుణమాఫీ హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.రైతు భరోసా నిధులు వెంటనే విడుదలని కోరారు. వ్యవసాయ కూలీలకు12,000 అందించాలని, అదేవిధంగా పంటల బీమా యోజన అమలు చేయాలని కోరారు.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. పెండింగ్ బకాయిల విడుదలచెసి, కరెంట్ సమస్యలను, మద్దతు ధరలు, సబ్సిడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా జనరల్ సెక్రెటరీ పడమటి జగన్ మోహన్ రెడ్డి, బిజెపి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్, బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకట్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.