Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BJP :సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోతున్నాం..

*డాక్టర్ .కాసం వెంకటేశ్వర్లు తెలంగాణ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*

BJP : ప్రజా దీవెన ‘హైద్రాబాద్: భారత రాజ్యాంగం యొక్క 75 సంవత్సరాల ప్రయాణం గుర్తు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా *సంవిధాన్ గౌరవ్ అభియాన్*కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు తెలిపారు..

*ఈ సందర్భంగా కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.*.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ప్రదేశాలను పంచ తీర్థాలుగా గుర్తించి అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీఅని గుర్తు చేశారు ..

వర్తమానానికి, భవిష్యత్తుకు భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను తెలియజేసేలా పోలింగ్ బూత్ స్థాయి నుండి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈనెల 19,20తేదీలలో అన్ని జిల్లా కేంద్రాలలో మేధావులతో సమావేశం ఏర్పాటు చేసి రాజ్యాంగానికి సంబంధించిన అంశాలను తెలియజేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపడుతుందని తెలిపారు అదేవిధంగా 22 ,23 తేదీలలో ఎస్సీ, ఎస్టీ బస్తీలలో కార్నర్ మీటింగ్ లు ఏర్పాటు చేస్తాము.. 24, 25 తేదీలలో యువతకు అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగం పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్న నిబద్ధతను తెలియజేయడానికి కళాశాలలో హాస్టల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వారి దృష్టికి తీసుకెళ్తామని కాసం వెంకటేశ్వర్లు తెలిపారు..

తెలంగాణలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలను మోసాలను ప్రజలు గమనిస్తున్నారని మరి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అనర్వులు రేషన్ కార్డులు ఇప్పించే దందా చేస్తుందని విమర్శించారు ..ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి పథకాలలో ఏ ఒక్కటి అమలు చేయకుండా రేవంత్ రెడ్డి మాట్లాడం సిగ్గుచేటని విమర్శించారు..

మరి రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగుపెట్టిన అక్కడ వారి అభ్యర్థులకు డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు హర్యానాలో రేవంత్ రెడ్డి లెగ్గు పెట్టి అధికారంలోకి వస్తదన్న కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని, అదేవిధంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పతనమైందో మనందరికీ తెలుసు అని అన్నారు.. ముఖ్యంగా మహారాష్ట్రలో జరిగే ఎన్నికల సమయంలో తెలంగాణ నుండి తరలిస్తున్న డబ్బు అత్యధికంగా పట్టుబడింది అని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సొమ్ము ఏటీఎం గా మారిపోయిందని విమర్శించారు.. ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన అబద్దాలను, మోసాలను అన్ని వివరిస్తామని తెలిపారు. ఉట్టికి ఎగరలేనోడు స్వర్గానికి ఎగురుతామనడం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాట్లాడడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు.. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పించాలని ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చారని కాసం వెంకటేశ్వలు తెలిపారు..