Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BjpMLARajaSingh : సింగ్ ఘాటు వ్యాఖ్య, సీఎం రేవంత్ తో టచ్ లో బీజేపీ నేతలు

సింగ్ ఘాటు వ్యాఖ్య, సీఎం రేవంత్ తో టచ్ లో బీజేపీ నేతలు

BjpMLARajaSingh :  ప్రజా దీవెన, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీలో పలు వురు సీనియర్ నేతలు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తో టచ్ లో ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొంతమంది ఎం పీలు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే లేఖను రిలీజ్ చేశారు. తె లం గాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్ర భుత్వ ముఖ్యమంత్రితో కొందరు నేతలు రహస్య సమావేశాలు పెట్టు కుంటున్నారని ఆరోపించారు. ఇ లాంటి సమావేశాలు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఎ ప్పుడు వస్తుందని ప్రశ్నించారు.

తెలంగాణ హిందూ సేఫ్‌గా ఉండా లంటే తెలంగాణలో డబుల్ ఇంజ న్ బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. బీజేపీ తెలంగాణలో రావాలంటే పాత సామాను బీజేపీ నుంచి బయటికి వెళ్లి పోవాలన్నారు. ఇది నా పార్టీ, నా అయ్యా పార్టీ అనే వాళ్లు తెలంగాణలో చాలామంది ఉన్నా రన్నారు. వాళ్లని రిటైర్ చేస్తేనే తెలంగాణలో బీజేపీకి మంచి రోజు లు వస్తాయన్నారు. ఇది తాను కాదు ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ అధి కారులు, కార్యకర్తలు ఇదే అనుకుం టున్నారని లేఖలో రాజాసింగ్ పే ర్కొన్నారు.

బీజేపీ నుంచి ఎమ్మెల్యే గా కొనసాగుతున్న రాజాసింగ్ ఆ పార్టీపైనే మరోసారి సంచలన ఆరో పణలు చేశారు. బీజేపీలో హిందూ ఐడి యాలజికల్‌గా పోరాటం చేసిన వ్యక్తిగా రాజాసింగ్‌కు ప్రత్యేకమైన పేరు ఉంది. గతంలో కూడా బీజేపీ ని ఒకే సామాజిక వర్గానికి వ్యక్తు లు శాసిస్తున్నారని, రాష్ట్ర నాయకత్వం అంతా కూడా రెడ్డి సామాజిక వర్గం చేతిలో ఉందంటూ బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు.

బీజేపీఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో కిషన్ రెడ్డి ఒకే సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు ఉన్న ట్లు అప్పట్లోనే రాజా సింగ్ లేఖ రాశారు. దీనిపై బీజేపీ జాతీయ నా యకత్వం పునరాలోచ నలో పడినట్లు తెలుస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పార్టీలో సముచిత స్థానం ఇస్తే కాంగ్రెస్, బీ ఆర్‌ఎస్‌ కు ధీటుగా ఎదిగే అవకాశం ఉంటుందని నెలరోజుల క్రితం రా జాసిం గ్ విడుదల చేసి లేఖ కూడా సంచలనం సృష్టించిన విషయం తె లిసిందే.

తాజాగా మరోసారి తెలం గాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు కొన సాగిస్తుండగా కొంతమంది బీజేపీ పార్టీ నుంచి పలువురు ఎం పీలు, ఎమ్మెల్యేలు రహస్యంగా రా ష్ట్ర ప్రభుత్వ పెద్దలతో సమావేశం అవు తున్నారని, ఇది బీజేపీకి మం చిది కాదన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే బీజేపీ రాష్ట్ర నాయక త్వంలో మొదటి నుంచి పేరుకు పోయిన చాలా మంది నేతలను పార్టీ నుంచి బయటకు పంపించి వేయాలని, వాళ్లని పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు.

దాంతో పాటుగా పార్టీని తమ అయ్య జాగీరుగా భావిస్తున్న వారు బీజేపీలో చాలా మంది ఉన్నారని, వారంతో కొన్ని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే అంటూ ఆరోపణ లు చేస్తూ లేఖను రిలీజ్ చేశారు రాజాసింగ్. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన త ర్వాత బీజేపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌లో ఉన్నవారి వివరాలు తనకు తెలుసని, వారిపై త్వరలోనే బీజేపీ జాతీయ నాయక త్వానికి ఫిర్యాదు చేయబోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు రాజాసింగ్. దీ నిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తు న చర్చ ప్రారంభం కాగా ఈ పరిస్థితి లు ఎటువైపు దారితీస్తాయో అన్న ఉత్కంఠ భరిత వాతావరణం నెల కొంది.