Blood Donation: ప్రజా దీవెన, కోదాడ : రక్తదానం (Blood Donation) చేయండి మరి ఒకరికి ప్రాణదాతలుగా నిలబడండి అని ఎంబిఎం ట్రస్టు సభ్యులు అన్నారు.శనివారం పట్టణంలోని స్థానిక కార్తికేయ హాస్పిటల్ (Karthikeya Hospital) లో చికిత్స పొందుతున్న మున్సిపల్ పరిధిలోని ఆజాద్ నగర్ కు చెందిన కోట సిరి కి అత్యవసర ఆపరేషన్ నిమిత్తం బి పాజిటివ్ బ్లడ్ అవసరం అని డాక్టర్ చెప్పడంతో తెలుసుకున్న ఎంబిఎం గ్రూప్ సభ్యులైన కోదాడ కొమరబండ కు చెందిన గుంజ అఖిల్ అమె కి బ్లడ్ ఇచ్చి ప్రాణదాతగా నిలిచారు.ఈ సందర్భంగా గ్రూపు సభ్యులు మాట్లాడుతూ ట్రస్ట్ (trust)ద్వారా ఇప్పటివరకు ఎంతోమందికి రక్తాన్ని అందించి ప్రాణదాతగా నిలుస్తున్నా మని తెలిపారు.
రాబోయే రోజులలో ఈ ట్రస్టు (trust)ద్వారా ఎంతోమందికి రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడుతున్నామని తెలిపారు కార్యక్రమానికి సహకరిస్తున్న గ్రూపు సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.బ్లడ్ ఇచ్చిన వారికి ఎంబిఎం ట్రస్టు సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు (trust members) తదితరులు పాల్గొన్నారు.