Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Blood Donation: రక్తదానం చేసి మరొకరి ప్రాణాం కాపాడవచ్చు. సురేష్

ప్రజా దీవెన, కోదాడ: రక్తదానం అన్ని దానాల కంటే గొప్పదని రక్తదానం చేసి మరొకరి ప్రాణం కాపాడవచ్చని మాతంగి బాయమ్మ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మాతంగి సురేష్ అన్నారు మంగళవారం కోదాడ పట్టణంలోని స్థానిక సంకల్ప హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న మునగాల మండలం వెంకటరాంపురం గ్రామానికి చెందిన డి రమాదేవి కి అత్యవసరంగా రక్తం అవసరం ఉందని డాక్టర్ తెలపగా ఎంబిఎం ట్రస్ట్ సభ్యులు చెడపంగు అఖిల్ బి పాజిటివ్ రక్తాన్ని అందించి ప్రాణాన్ని కాపాడారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన అఖిల్ ను ట్రస్ట్ తరఫున అభినందించి ధన్యవాదాలు తెలిపారు