Breaking : ప్రజా దీవెన, దావోస్: దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ముఖ్యమం త్రి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం జ్యూరిచ్ విమానాశ్రయం చేరుకో గానే అక్కడ స్థిరపడిన తెలుగు వారితో సందడి నెలకొంది. ముఖ్య మంత్రి గారెకి పెద్ద ఎత్తున హాజరై అభినందనలు తెలియజేశారు.
జ్యూరిచ్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పర స్పరం మర్యాద పూర్వకంగా కలు సుకున్నారు.ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభి వృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల కు సంబంధించిన అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కూడా ఉన్నారు.
దావోస్ సదస్సు తొలి రోజున పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతా రు. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్య స్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే నిర్దిష్ట మైన భవిష్యత్తు ప్రణాళికతో ఈ పర్యటనపై రాష్ట్ర ప్రతినిధి బృందం ప్రత్యేకంగా దృష్టి సారించింది.