Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS : బిఆర్ఎస్ నిరసనల హోరు

–నియోజకవర్గ,మండల కేంద్రాలు, గ్రామాల్లో కార్యకర్తల ధర్నాలు

–ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కు తోందని ఆరోపణలు

BRS : ప్రజా దీవెన, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నుంచి బిఆర్ఎస్ మా జీ మంత్రి, ఎమ్మెల్యే జగ దీశ్‌రెడ్డిని సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ బీ ఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు మండల కేంద్రాలు, గ్రామా ల్లో ఆ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ధర్నాలు నిర్వహించారు. జగదీశ్‌ రెడ్డి సస్పెన్షన్‌ అప్రజాస్వామికమని నినదించారు. ఈ సందర్భంగా నిర సనలు చేపట్టిన బీఆర్‌ఎస్‌ శ్రేణు లకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలి పారు. కార్యకర్తలు చూపిన సమ రోత్సాహం రాష్ట్ర నాయకత్వానికి కొండంత స్ఫూర్తినిచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆ ర్‌ఎస్‌ కార్యకర్తలు పిడికిలి బిగిం చిన తీరు అభినందనీయమన్నా రు. పరిపాలన చేతకాక అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ గొంతు నొక్కాలని చూ స్తున్న సీఎంకు ప్రజలపక్షాన తప్ప కుండా మూడు చెరువుల నీళ్లు తా పిస్తామని అన్నారు.

ఆరు గ్యా రంటీలతో ఆగం చేసి, 420 హమీ లతో మభ్యపెట్టి తెలంగాణను ది వాలా దిశగా నడిపిస్తున్న కాంగ్రెస్ సర్కారు పాపం పండిందని స్పష్టం చేశారు. ఓ వైపు బీజేపీ నేతలతో కుస్తీ పడుతున్నట్లు ఫోజులు కొట్టి, దొంగచాటుగా దోస్తీ చేసే నీచ సం స్కృతికి రేవంత్ తెరలేపారన్నారు. సీఎం హోదాలో ఉండి బీజేపీ నేత లతో చీకటి మీటింగులేంటని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ లో బీజేపీ కోవర్టులు ఉన్నారంటున్న రాహుల్ గాంధీకి, రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికి పోయిన రేవంత్రెడ్డిపై చర్య తీసుకు నే ధైర్యం ఉందా అని నిలదీశారు. కాగా, బీఆర్ఎస్ అది నేత కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బ షీరాబాద్ పోలీస్ స్టేషన్లో లో ఎమ్మెల్సీ శంబీ పూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, మర్రి రాజశేఖర్రెడ్డి, ఫిల్మ్ నగర్ పీఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అనుచరుడు జైసింహ, ఉస్మానియా వర్సిటీ పీఎస్ లో బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఫిర్యాదు చేశారు. ఇఫ్లూ వర్సిటీ సర్కిల్ వద్ద బీఆర్ఎస్ వీ ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వ హించగా పోలీ సులు వారిని అరెస్టు చేశారు. కాగా, ఓర్పులేని వాళ్లు మార్పు ఎలా తెస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నిం చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే సభ నుంచి బహిష్క రిస్తారా అని నిలదీశారు.

ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ప్రజా సమస్యలను శాసనసభలో కూడా లేవనెత్తని వ్వరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎప్పుడు ఏ ఆపదొచ్చినా బీఆర్ఎస్ అండగా ఉంటుం దని ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరా రు. స్పీకర్ ను జగదీశరెడ్డి అవమా నించలేదని, ఆయనపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో బీఆ ర్ఎస్ నిరసన సందర్భంగా ఉద్రిక్తత తలెత్తింది. తెలంగాణ తల్లి చౌర స్తాలో నిరసన వ్యక్తం చేసేందుకు గుమి గూడిన బీఆర్ఎస్ నాయ కు లను పోలీసులు అడ్డు , కోగా వా గ్వాదం చోటు చేసుకుంది. అదే సమ యంలో హోలీ సంబరాల్లో భాగంగా కాంగ్రెస్ నాయ కులు రోడ్డు పైకి రావడం. ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో బీఆర్ఎస్ నాయ కులు అంబేడ్కర్ విగ్రహం దగ్గర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నంచే శారు. దీంతో తెలంగాణ చౌక్ నుం చి అంబేడ్కర్ చౌక్ వరకు పోలీ సులు పరిగెత్తుకుంటూ వెళ్లారు. దిష్టిబొ మ్మలపై నీళ్లు పోసి.. బీఆ ర్ఎస్ నేతలను అక్కడి నుంచి పంపించేయడంతో వివాదం సద్దు మణిగింది.