Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Brs Harish Rao మీ మొండి వైఖరితో రైతు కంట్లో కారం

--మీరు అన్యాయం చేస్తుంటే వంత పాడాలా --ఏక్క‌డ ఏమి జరిగినా అది మా పార్టీ కుట్రేనా --ల‌గ‌చ‌ర్ల దాడితో మా పార్టీ కి ఏం సంబంధమో చెప్పగలవా --రేవంత్ పాల‌న అంతా నికి ఇక కౌంట్ డౌన్ ప్రారంభం --చ‌ర్ల‌ప‌ల్లి జైలు వ‌ద్ద మీడియాతో హ‌రీశ్ రావు

మీ మొండి వైఖరితో రైతు కంట్లో కారం

–మీరు అన్యాయం చేస్తుంటే వంత పాడాలా
–ఏక్క‌డ ఏమి జరిగినా అది మా పార్టీ కుట్రేనా
–ల‌గ‌చ‌ర్ల దాడితో మా పార్టీ కి ఏం సంబంధమో చెప్పగలవా
–రేవంత్ పాల‌న అంతా నికి ఇక కౌంట్ డౌన్ ప్రారంభం
–చ‌ర్ల‌ప‌ల్లి జైలు వ‌ద్ద మీడియాతో హ‌రీశ్ రావు

ప్రజా దీవెన, హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగినా బీ ఆర్‌ఎస్‌ ( brs ) కుట్ర ఉందని ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్ది పేట శాసన సభ్యులు తన్నీరు హ రీష్ రావు ( harish rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికా రులపై దాడి కుట్రకేసు లో అరెస్టై నిన్న చర్ల పల్లి జైలులో (charla pally jail) రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మా జీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని( ex MLA narendhar reddy) చర్లపల్లి జైలులో గురువారం ములాఖ‌త్ స‌మ‌యంలో హ‌రీశ్ బృందం భేటి అయ్యింది.

పార్టీ అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని, ధైర్యంగా ఉండాల‌ని ప‌ట్నం కు భరోసాఇచ్చారు. అ నంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మీరు చేసే అక్ర మాలకు చిడతలు వాయించాలా అంటూ సీఎం రే వంత్‌రెడ్డిపై ( cm revanth reddy) మండిపడ్డారు. రేవంత్ పగ ప్రతీకారంతో పట్నంను నరేందర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయించారని ఆరో పిం చారు. కొడంగల్ ( koda ngal) నుంచే ప్రజాపాలన మీద తిరుగు బాటు మొదలైందని, ఈ అరె స్ట్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిద ర్శనమన్నారు.

మీకు ఓటేస్తే మేలు జరుగుతుందనుకుంటే పాపానికి లగచర్ల గ్రామం భూము లను గుంజుకోవడమే మీరు చేసే మేలా అంటూ ఆగ్రహం వ్య క్తంచేశారు. కాంగ్రెస్ ( congress ) నాయకులు అబద్దాలు మా ట్లాడుతున్నారన్నారు.ఎక్కడ ఏం జరిగినా బీఆర్‌ఎస్‌పై పెడుతు న్నా రన్నారు. నిరుద్యోగులు, రైతులు, పోలీసులు ( police ) స్వ చ్ఛం దంగా ధర్నా చేస్తే అది బీఆర్‌ఎస్‌ చేయించిందని రేవంత్ అంటు న్నా రని, రేవంత్ సొంత నియోజకవర్గంలో తమ భూముల కోసం గిరి జ నులు ( Tribal people)  పోరాటం చేస్తే అది కూడా బీఆర్‌ఎ స్‌ చేసిందనే అంటున్నారన్నారు.

ప్రజలకు అన్యాయం జరిగితే పో రాడడం ప్రతిపక్షాలుగా ( oppos itions) మా బాధ్యత అన్నారు.మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టా లను కుంటున్నావే మో, మాపై కోపం ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయం డి‌,కానీ అమాయక గిరిజన రైతులపై కేసులెలా (case s against farmers) పెడతారని సీఎంని ప్రశ్నించారు. వెంటనే గిరిజన రైతు లను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

*రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మృగ్యం..* రాష్ట్రంలో ప్రజాస్వా మ్యమె క్కడుంది అంటూ నిలదీ శారు.మల్లన్నసాగర్‌లో రేవంత్‌ రెండురో జులు నిరసన చేస్తే మేం అడ్డుకున్నమా అని ప్రశ్నించారు. అర్ధరాత్రి మహిళల చాతిమీద కాళ్లు పెట్టి అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఈ ప్రజల తిరు గుబాటు ఆగదని, రేవంత్‌ని గద్దె దించే దాకా నిద్రపో మన్నారు. త‌మ‌ ప్రభుత్వంలో 14వేల ఎకరాలు ఫార్మాసిటీ ( form acity)  కోసం సేకరించామని,అక్కడెందుకు ఫార్మాసిటీ కట్టరని ప్ర శ్నించారు.

ఇందిరమ్మ ముసుగులో దళితుల, గిరిజనుల భూములు గుంజుకుం టున్నా రని, ఇందిరమ్మ ( indhira)ఎమర్జెన్సీ పాలన ఇప్పుడు కని పిస్తోందన్నారు. రైతుల భూములు గుంజు కోవడమే ఇందిరమ్మ పాల న అని నిలదీశారు. రేవంత్‌ పాలన అదా నీ, తమ్ముళ్లు, అల్లుళ్ల కోస మేనని తేల్చి చెప్పారు. రైతుల భూముల‌ ను కాపాడేందుకు బీఆర్‌ఎ స్‌ పార్టీ దళిత, గిరిజనుల పక్షాన నిలబడు తుందని స్పష్టం చేశారు.

*లగచర్లతో నరేందర్ రెడ్డి కి ఏం సంబంధం…*  ఇక నరేందర్ రెడ్డి కి ఈ కేసుతో ఏ సంబంధం లేదన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముం దో తెలియదని, మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచడానికి ఒక్క ని ముషం ముందు ఒత్తిడి చేసి నరేందర్‌రె డ్డితో సంతకం చేయించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి బడాబాబులపై ప్రేమ ఉందన్నారు. న రేందర్‌రెడ్డి ధైర్యంగా ఉన్నారని,  ఆయ నకు బీఆర్‌ఎస్‌ అండగా నిలుస్తుందన్నారు.

ధర్మమే గెలుస్తుందని, న్యాయస్థానంలో ( court )తమకు న్యాయం జరుగుతుందన్నారు. ఆయన నిర్దో షిగా బయటకు వస్తారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత (Public opposi tion) కొడంగల్ నుండే ప్రారంభమయ్యిందన్నారు. ఉద్యమాలు, కే సులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదన్నారు. అన్యాయంగా పేద ప్రజల భూములు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. అక్రమంగా నరేందర్ రెడ్డిని అరెస్టు చేసినా, అక్రమ కేసులు పెట్టినా ప్రజల తిరు గుబాటు కొడంగల్ నుండే ప్రారంభమయ్యిందన్నారు. హ‌రీశ్ రావు వెంట‌నే ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి, ఇత‌ర నేత‌లు ఉన్నారు.

Brs Harish Rao