–రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం
–సాగునీళ్లు లేక పంటల లేక సాగిళ్ల పడుతున్నారు
–అసలు ప్రభుత్వానికి జల విధాన మంటూ ఉందా లేదా
— సూర్యాపేటలో బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత
BRSkalvakuṇṭlakavita : ప్రజా దీవెన, సూర్యాపేట: ప్రభు త్వం సాగునీళ్లు ఇవ్వక రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని, అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల గోడు పట్టడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట లు ఎండి రైతులు ఆందోళన చెందుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మా త్రం ఇంకా మాటలు చెబుతూ మభ్యపెడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తలుగుతుందని శపించారు. తెలం గాణకు నీళ్లు మలపాలన్న సోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని, రాజకీయ కక్షతో మేడిగడ్డను వాడు కోక తెలంగాణను ఎండబెడుతున్నారని మండిపడ్డారు.
మంగళవారం పెద్దగట్టు లింగమంతుల స్వామివారి జాతరలో ఎమ్మె ల్సీ కవిత పాల్గొని చౌడమ్మ తల్లికి బోనం సమర్పించారు. లింగమం తుల స్వామి వారిని దర్శించుకున్న అనంతరం సూర్యాపేట జిల్లా బీఆ ర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 199 టీఎంసీలతో బన కచర్లలో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిం దని, అనుమతులతో ఆ రాష్ట్ర సీ ఎం చంద్రబాబు నాయుడు ప్ర యత్నాలు చేస్తున్నారని, కానీ మన ముఖ్యమంత్రి మాత్రం కనీసం నాగార్జున సాగర్ ను కూడా మన ఆధీనంలోకి తీసుకురాలేకపోయా రని విమర్శించారు.
కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ గోదావరి జలాలను పారించారని, కృష్ణా పరివాహక ప్రాంతంలోనూ గోదావరి నుంచి నీళ్లు ఇచ్చిన ఘన త కేసీఆర్ దని స్పష్టం చేశారు. కేసీ ఆర్ హయాంలో కోదాడ నియోజక వర్గానికి కాళేశ్వరం ద్వారా లక్షా 22 వేల ఎకరాల కు నీళ్లు అందించారని వివరించారు. ఇప్పుడు నీళ్లు ఎందుకు తేవ డం లేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్ర శ్నించా రు. ఇప్పుడు నీళ్లు ఎందుకు తేవడం లేదో చెప్పాలని మంత్రి ఉత్తమ్ కు సవాలు విసిరారు.
రాజకీయ కక్షతోనే మేడిగడ్డ ప్రాజె క్టును వినియోగించడం లేదని ఇం జనీర్లు చెబుతున్నారని చెప్పారు. మరో 40 రోజుల పాటు నీళ్లు ఇస్తే నే పంటలు చేతికొచ్చే అవకాశం ఉం టుందని, అయినా రాష్ట్ర ప్రభు త్వం మాత్రం నీళ్లు ఇవ్వడం లేదని ఎండగట్టారు. గత ఏడాది నీళ్లు ఇవ్వక సూర్యాపేట, మహబూబా బాద్ జిల్లాల్లో 4 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని, నీళ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇవ్వ కపోవడం వల్లనే అప్పుడు పంటలు ఎండిపోయాయని తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వ హించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో పంటలు ఎండి పోతున్నాయంటే ఆ పాపం, ఉసురు మంత్రి ఉత్తమ్ కు తగులు తుందని స్పష్టం చేశారు. జిల్లా మంత్రియే కాకుండా సాగునీటి శాఖ మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వని మంత్రి ఉన్నా ఒక టే లేకున్నా ఒకటేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజంతా కేసీఆర్ ను తిట్టుకుంటూ తిరిగితే కాంగ్రెస్ నాయకులకు ఒరిగేదేమీ లేదని, ప్రజ ల కోసం పని చేయాలని కాంగ్రె స్ నాయకులకు హితవు పలికారు.
కేసీఆర్ ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల ప్రేమతో పరిపాలించారని, కానీ రే వంత్ రెడ్డి మాత్రం ఏ ఒక్క అంశం పై ఆలోచన చేయకుండా పాలిస్తు న్నారని చెప్పారు. “14 నెలల్లో 30 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఎవరు ఏమనుకున్నా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దల కాళ్లు పట్టుకుంటా అ న్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నా రు. మహిళలకు ఒక్క కార్యక్రమా న్ని కూడా చేయని కాంగ్రెస్ ప్రభు త్వం. మహిళల అంశాలపై ముఖ్య మంత్రి కనీసం ఒక సమీక్ష చేయలేదు. మహిళలకు ప్రభుత్వం ఏమి చేయలేదు. ఏం చేశారో చెప్పడానికి ప్రభుత్వ పెద్దలు చర్చకు రావా లని సవాలు చేశారు.
కేసీఆర్ హయాంలో మహిళలకు పెద్దపీట వేశామని, మహిళా అభి వృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో మహిళలపై నేరాలు చేయాలంటే వెన్నులో వణు కుపుట్టేదని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరి స్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో మత కల్లోలం లేని ప్రాంతమే లేదని, కాంగ్రెస్ పార్టీ పాలనలో శాంతి భద్ర తల సన్నగిల్లాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఏ వర్గానికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు.
ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రా నికి పంపారుని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎస్సీ, బీసీల జనాభాను త క్కువ చేసి చూపిస్తున్నదని ఎత్తి చూపారు. గందరగోళం కాకిలెక్కల తో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెల్లదీ స్తున్నారని మండిపడ్డారు. బీఆ ర్ఎస్ పార్టీ గల్లా పట్టుకొని అడిగితే రైతు రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ ఎవరికీ సంపూర్ణంగా రుణ మాఫీ కాలేదని చె ప్పారు.
రైతుభరోసా ఒక్కో గ్రామంలో సగం మంది రైతులకు కూ డా రాలేదని అన్నారు. రైతులను కూడా మోసం చేస్తూ రేవంత్ రెడ్డి పైశాచికానం దం పొందుతున్నారని విరుచుకుపడ్డారు. ఈ మీడియా సమావేశం లో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, మల్లయ్య యాదవ్, మాజీ రాజ్యసభ సభ్యులు బ డుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.