BRS KTR sunkishala : ప్రభుత్వoదే సుంకిశాల ప్రమాదం బాధ్యత
--పురపాలక శాఖ చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి --ప్రభుత్వం తప్పు లేకపోతే సమా చారం ఎందుకు దాచిపెట్టారు --అసెంబ్లీ సమావేశాల సమయం లోనే ప్రమాదం జరిగింది --ప్రమాద సంఘటనను బడ్జెట్ స మావేశాల్లోనే స్టేట్ మెంట్ చేయా ల్సింది --తెలంగాణ భవన్ మీడియా సమా వేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్
ప్రభుత్వoదే సుంకిశాల ప్రమాదం బాధ్యత
–పురపాలక శాఖ చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి
–ప్రభుత్వం తప్పు లేకపోతే సమా చారం ఎందుకు దాచిపెట్టారు
–అసెంబ్లీ సమావేశాల సమయం లోనే ప్రమాదం జరిగింది
–ప్రమాద సంఘటనను బడ్జెట్ స మావేశాల్లోనే స్టేట్ మెంట్ చేయా ల్సింది
–తెలంగాణ భవన్ మీడియా సమా వేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్
ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి తాగునీటి అవస రాల నిమిత్తం నాగార్జు నసాగర్ ( nagarjuna Sagar) డ్యాం పరిధిలో తలపెట్టిన సుంకిశాల పథకం ప్రమాదానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బి ఆర్ ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ ( ktr ) పేర్కొన్నారు. ఈ ప్రమాదా నికి పూర్తి బాధ్యత పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్య మంత్రి రేవంత్ దేనని ఉద్ఘాటించారు.
అసెంబ్లీ సమావేశం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) అస మర్థత, చేతగానితనం, చేవ లేని తనం వల్లనే సుంకిశాల ప్రమా దం జరిగిందని ఆరోపించారు. ప్రభు త్వం తప్పులేకుంటే ఎందుకు వా రం రోజులపాటు దాచిఉంచిందని ప్రశ్నించారు.అసెంబ్లీ సమావేశాలు ( assembly sessions) జరగు తున్న సమయంలో ఆగస్ట్ 2 న ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ విష యాన్ని ప్రభుత్వం ( govern ment) సమావేశాల్లో స్టేట్ మెంట్ చేయాల్సి ఉన్నా కానీ ఎందుకు చెప్పలేదని నిలదీశారు.
ఈ ప్రభుత్వానికి ఈ ప్రమాదం జరిగిన విషయం తెలియాదా లేక పోతే తెలిసి పట్టించుకోలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అదే సందర్భంలో ఒక వేళ మీకు ఈ విషయమే తెలియదంటే మా త్రం ఇది సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదం గురించి పక్కా మీకు తెలుసు కాబట్టే వారం రోజులు గో ప్యంగా ఉంచారని ఆరోపిం చారు. మీరు ఆగమాగం పనులు ప్రారంభిచంటంతో ఈ ప్రమాదం ( accid ent) జరిగిందని అధికారులే చెబుతున్నారని, అధికారులు చెప్పినా కూడా వినకుండా గేట్లు అమర్చటంతో ఈ ప్రమాదం జరిగిం దని స్పష్టం చేశారు.
అదృష్టవశాత్తు కూలీలు షిఫ్ట్ మారినప్పుడు ప్రమాదం జరిగిందని, లే కుంటే భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగేదని, మంచి జరిగితే మాది అన్నచందంగా చెడు జరిగితే బీఆర్ఎస్ ( brs ) మీద తప్పుడు ప్రచారం చేసే చిల్లర ప్రయత్నాలు వద్దని హి తవు పలికారు. పుర పాలక శాఖ (municipal department ) ను పర్యవేక్షించకుం డా ఉన్నా ముఖ్యమంత్రిదే దీనికి బాధ్యత అని,మళ్లీ మాపైనే చిల్లర దాడికి తెగబడుతూ చిల్లర ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బాధ్యతల నుంచి తప్పించుకొని గత ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేయటం సిగ్గుచేటన్నారు.
ఎన్నికల్లో ప్రయోజనం కోసం కాలే శ్వరం ( kaleswaram) పైన చేసిన అడ్డగోలు వాదనలు తేలి పోయాయని తెలిపారు. 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన కూడా ప్రాజెక్టు చెక్కుచెదరకుండా ఉన్న దని, కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైతే మరి ఇప్పుడు ఈ ప్రభు త్వం ఏ విధంగా రిజర్వాయ ర్లను పంపించేసి నీటితో నింపుతుంది, నీళ్ల విషయంలో కెసిఆర్ ( kcr) విజయాలను అంగీకరించలేని కుర చమనస్తత్వంతోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని దుయ్య బట్టారు.
కాళేశ్వరంలో జరిగితే ఎన్డీ ఎస్ఏ వస్తదని, ఆగమేఘాల మీద రిపోర్ట్ ఇస్తారని, మరి ఇక్కడకు ఎందుకు కేంద్ర సంస్థ వస్తలేదని, ఇది కాంగ్రె స్, బీజేపీ కుమ్మక్కు అని అనుకోవాలె కదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై జ్యూడిషియల్ ఎంక్వై రీ ( judicial enquiry) వేయా లని సంఘటన స్థలంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటి ప్రక టన చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి ది బాధ్యతారాహిత్యమని, పరిపాలన మీద పట్టులేని విషయం తేలి పోయిందని ఎద్దేవా చేశారు.
ఈ విషయంలో తప్పించుకుంటామంటే ప్రజలకు అన్ని విషయాలు తెలు సునని చెప్పారు.సుంకిశాల ప్రాజెక్టు ఇంజనీరింగ్ లోపం లేద ని, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానం లో లోపం ఉన్నదని, కాంగ్రె స్ పార్టీ ( congress party) దివాలా కోరు విధానం తప్ప, ఇప్పటి దాకా తీసుకొచ్చిన విధానాలు ఏంటిదో చెప్పాల ని డిమాండ్ చేశా రు.మేడిగడ్డలో జరి గిన సంఘటనను మేము దయ లేదని, ఎన్నికల కోడ్ ఉన్న సరే ప్ర మాదం జరిగిన విషయాన్ని చెప్పా మని, ఘటన జరిగిన గంటల్లోనే మేము లోపాలు సర్దుతామని ఎల్ అండ్ టీ ( l& t) చెప్పిందని, మాకు సీక్రెసీ మెయింటెన్ చేయాల్సిన అవసరం లేద ని స్పష్టం చేశారు.
కానీ ముఖ్య మంత్రి ఎందుకు ఈ విషయాన్ని దాచారని, ఈ ప్రమా దం జరిగిన ప్పుడు హైదరాబాద్ ( hydarabad) లోనే సీఎం ఉ న్నారని, ఆ మరు నాడే దాని మీద పర్యవేక్షణ లేకుం డా అమెరికా వెళ్లారని గుర్తు చేశా రు.మీకు చిత్త శుద్ధి ఉంటే కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్ పెట్టి, బాధ్యులపై చర్యలు తీ సుకోవాలని, భట్టి విక్ర మార్క( batti vikramarka) ఇత రులపై తప్పుడు ప్రచారాలు చేయ వద్దని, ఒకవేళ ముఖ్యమంత్రి ఈ విషయం తెలియకపోతే ఆయన పరిపాలన పట్టు లేనట్లేనని స్పష్టం చేశారు.
సుంకిశాల ( sinkishala) ప్రమాదానికి కారణమై రాష్ట్ర సొమ్ము ను ప్రభుత్వం దుర్విని యో గం చేసిందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాం లో దీనికోసం ప్రతి పాదన చేశారని, అప్పట్లో మాకు అన్యా యం చేయవద్దంటూ రైతు లు( formers) అడ్డు కోవటంతో అక్కడ ఒక సబ్ ఇన్ స్పెక్టర్ కూ డా చనిపోయారని, గత ప్రభుత్వాల హయాంలో రెండు, మూడు దశలు అంటూ ప్రభుత్వం ప్రతిపాదన తెచ్చారని, కానీ రైతులు మళ్లీ అడ్డు కోవటంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపో యిందన్నారు.
ఆ తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చాక ఏక బిగిన సాగు నీటి ప్రాజెక్ట్ లు చేప ట్టారని, రైతుల్లో విశ్వాసం నింపటంతో సుంకి శాలను రైతులు అడ్డుకోలేదని,ఎలిమినేటి ప్రాజెక్ట్ ( amrp) ద్వారా నీళ్లు ఎత్తిపోయా లంటే సాగర్ లో 510 అడుగుల నీళ్లు ఉం టేనే నీళ్లు తీసుకోవటం సాధ్యమవుతుందని,సుంకిశాలలో మాత్రం 462 అడుగులు ఉన్నా సరే నీళ్లు తీసుకోవచ్చని వివరించారు.
రాబో యే 50 ఏళ్లలో హైదరాబాద్ నీటి అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ను కేసీఆర్ చేపట్టారని, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజా ప్రతినిధులంతా కలిసి మేము అప్పుడు దీన్ని శంకుస్థాపన చేశా మని, శరవేగంగా ప్రాజెక్ట్ కు ముందుకు తీసుకెళ్లామని, మూడు పైప్ లైన్ల ద్వారా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందనీ పేర్కొన్నారు. కృష్ణా నది (krishna river ) కి మూడు, నాలుగేళ్లు వరద రాకపోయిన డెడ్ స్టోరేజ్ నుంచి సుంకిశాల ద్వారా నీళ్లు తేవచ్చని, ఓఆర్ఆర్ ( or r)చుట్టు ఒక రింగ్ మెయిన్ చేయాలనే ఉద్దేశంతో గోదావరి, కృ ష్ణా నీళ్లు తీసుకొచ్చే ప్ర యత్నం చేశారని గుర్తు చేశారు.
ఈ విషయాలన్నీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వానికి ఈ విషయాలు ఏమీ తెలి యవని ఎద్దేవా చేశారు. మెట్రో పాలిటన్ సిటీలు ఢిల్లీ (Delh i), బెం గళూరు ( bengluru) లాంటి చా లా నగరాల్లో నీటి భారీ కొరత ఉం దని,దేశ రాజధాని ఢిల్లీ లో నీటి కోసం యుద్దాలు జరు గుతున్నా యని, హైదరాబాద్ లో మాత్రం ఆ పరిస్థితి లేదని తెలిపా రు. హైదరా బాద్ కు తాగు నీటి కరువు ఉండ కుండా చేసేందుకే ఈ ప్రాజెక్ట్ చేపట్టా మని, సీతారామా ప్రాజెక్ట్ గురించి భట్టి గారు బిల్డప్ ఇచ్చారు, కానీ ఆ ప్రాజెక్ట్ ను చేపట్టింది, పూర్తి చేసింది కూడా కేసీఆర్ ( kcr ) అని వ్యా ఖ్యానించారు.
కేసీఆర్ పూర్తి చేసిన పథకాన్ని మీరు పూర్తి చేసినట్టు చెప్పుకున్న ప్ర జలకు అన్ని విష యాలు తెలుసునని, సుంకిశాలను చాలా వేగం గా పను లు పూర్తి చేశామని, ఒక్క మోటార్ ఫిట్టింగ్ పనులు మాత్ర మే ఉండే వని,2024 సమ్మర్ నాటికి పూర్తి చేయాలని మేము లక్ష్యం గా పెట్టుకున్నామని, కానీ ఈ ప్రభుత్వం మొత్తం పనులను పెం డింగ్ పెట్టారని విమర్శించారు. పురపాలక శాఖలో మొత్తం పనులను పడ కేశాయని, సుంకిశాల పనులను పక్కన పెట్టారని దుయ్యబట్టారు.
మొన్నటి ఎండ కాలంలో హైదరాబాద్ ట్యాంకర్లు రావటంతో ప్రభు త్వం మీద తీవ్ర విమర్శలు వచ్చాయని, ముఖ్య మంత్రి మీద కూడా విమర్శలు రావటంతో రెం డు, మూడు నెలల కిత్రం దున్న పోతు నిద్ర వీడారని, ఆ తర్వాత అధి కారులను ఒత్తిడి పెట్టి ఆగమాగం పనులు చేపట్టారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రమాదం ఎం దుకు జరిగిందని జల మండలి (jalamandali) అధికారితో వివ రంగా మాట్లాడానని, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను కూడా స్పీడ్ గానే చేశామని వెల్ల డించారు.సాగునీరు, తాగునీరు రెండింటికి ప్రాధాన్యం ఇచ్చాం కనుకే రైతులు ఆందోళన చేయలేదని, సుంకిశాల ప్రమాదం కాంగ్రెస్ వైఫల్యం, రేవంత్ రెడ్డి వై ఫల్యం. అందుకే చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు.
పరి పాలన రాక ప్రతి దానికి కేసీఆర్ గారి మీద తప్పుడు ప్రచారం చేస్తు న్నారు. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ ( law and orde r) సరిగా లేదు, వాళ్ల బాకా ఊ దే పత్రికలే లా అండ్ ఆర్డర్ మీద కథనాలు రాస్తున్నాయని, పేర్లు మా ర్చటమేనా మార్పు అంటే భట్టి విక్రమార్క తన ఆలోచన విధానాన్ని మార్చాలని హితవు పలికారు. మేము కూడా సుంకిశాల కు వెళ్లి మొత్తం వివరాలను అక్కడ నుంచి వివరిస్తామని, మేడిగడ్డ మీద విచా రణ చేస్తున్నారని, 10 లక్షల క్యూ సెక్కుల ప్రవాహం ఉన్న సరే మేడి గడ్డకు (medigadda) ఏమీ కాలేదని, ఇన్నాళ్లు కాళే శ్వరమంతా చిల్లర, దివాళాకోరు ప్రచారాలు. ప్రకృతే వీళ్ల తప్పుడు ప్రచారాలకు సమాధానం చెప్పింది.
వీళ్లకు సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు. వీళ్లకు బ్యారేజ్ గేట్లు ఎప్పుడు దిం చుతారో కూడా తెలియదు. కన్నె పల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తి పోయటానికి ఎలాంటి ఇబ్బంది లేద ని, ఇంత మంచి ప్రాజెక్ట్ ను తప్పు డు ప్రచారం చేస్తున్నారని ఇంజనీర్లే ఆవేదన వ్యక్తం చేస్తు న్నారని ఆయన అన్నారు. కాళేశ్వరం ఫెయి ల్ అయితే అన్ని రిజ ర్వాయర్లకు నీళ్లు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు.ఇది మూర్ఖ, కుచ్చిత మనస్తత్వం ఉన్న ప్రభుత్వమని,నీళ్ల విషయంలో కేసీఆర్ కు పేరు వస్తదనే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగానీ తనం కారణంగానే వారం రోజుల పాటు ఈ అంశాన్ని దాచిపెట్టారని, ఒక వేళ ఈ విష యం రేవంత్ రెడ్డికి తెలియకపోతే ముఖ్యమంత్రిగా పరిపాలన మీద ఆయనకు ఎంత పట్టు ఉన్నట్లు అని ఎద్దేవా చేశారు.
BRS KTR sunkishala