దివ్యాంగులను దగా చేసిన కాంగ్రెస్
–బిఆర్ఎస్ శాసనమండలి సభ్యు రాలు ఎమ్మెల్సీ కవిత
ప్రజా దీవెన, హైదరాబాద్: ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభు త్వం దివ్యాంగులను మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రపంచ దివ్యాంగుల దినో త్సవం సందర్భంగా తెలంగాణ దివ్యాంగుల సమైక్య సంఘం ప్రతిని ధులు,బంజారా హిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో శేరిలిం గంప ల్లి బిఆర్ఎస్ నేత చిర్ర రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవి తను కలిశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 500 రూపాయలు ఉన్న దివ్యాం గుల పెన్షన్ ను 4,000 రూపాయలకి తెలంగాణ మొదటి సీఎం కెసీ ఆర్ పెంచారని ఎమ్మెల్సీ కవిత గుర్తుకు చేశారు. దివ్యాంగులకు దేశం లోనే అత్యధికంగా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృ ష్టించిందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గుర్తుకు చేసారు. దివ్యాం గుల స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందించడం, దివ్యాం గుల సంక్షేమ బడ్జెట్ ను నాలుగు రెట్లు పెంచడం లాంటి అనేక గొప్ప కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
అయితే దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఎన్ని కల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్,ఏడాది దాటినా అమలు చే యకుండ మోసం చేసిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం RWPD 2016 చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని, దివ్యాంగులకు రిజర్వేషన్లను కూడా సరైన రీతిలో అమ లు చేయడం లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. దివ్యాంగులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, సబ్సిడీ రుణాలు, పెన్షన్ల పెంపు వంటి అం శాలపై అసెంబ్లీలో చర్చించాలని, తెలంగాణ దివ్యాంగుల సమైఖ్య సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితకు వినతి పత్రం అందజేసారు.
Brs mlckavitha