Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KCR: బిఆర్ఎస్‌ను 14 సీట్లలో గెలిపిస్తే తడాఖా చూపిస్తా

తెలంగా ణ దేశాన్ని శాసించే స్థాయిలో ఉం డాలంటే బిఆర్ఎస్‌ను గెలిపించా లని బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ రాష్ట్ర ప్రజలను కోరారు. దేశాన్ని పాలించేది ప్రాంతీయ పార్టీల శక్తే అని జోస్యం చెప్పారు.

ఎన్నికల తరువాత కూటమి కోసం ప్రయత్నం చేస్తాం
దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాo
అవసరమైతే ప్రధానమంత్రి రేసు లో ఉంటాo
బిఆర్ఎస్ పార్టీగానే ఉంటుంది, ఎలాంటి మార్పులు చేయబోo
దేశంలో సన్‌ఫ్లవర్(పార్టీ మార్పు) లు ఎక్కువయ్యారని ధ్వజం
ప్రెస్ మీట్ లో టిఆర్ఎస్ అధినేత కెసిఆర్

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ దేశాన్ని శాసించే స్థాయిలో ఉం డాలంటే బిఆర్ఎస్‌ను(BRS) గెలిపించా లని బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ రాష్ట్ర ప్రజలను కోరారు. దేశాన్ని పాలించేది ప్రాంతీయ పార్టీల శక్తే అని జోస్యం చెప్పారు. ద్రావిడ పార్టీ లను మనం ఆదర్శంగా తీసు కోవా లని ప్రజలకు సూచించారు. జాతీ య రాజకీయాల ప్రస్థానాన్ని తాను కొనసాగిస్తానని, ఎన్నికల తరువాత కూటమి కోసం ప్రయత్నం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. జాతీయ పార్టీలు తమకు మద్ధతు ఇవ్వక తప్పని పరిస్థితిని తీసుకువస్తామ న్నారు. మహారాష్ట్రంలో పోటీ చే యాలని అక్కడి ప్రజలు తనను కోరుతున్నారని, ఆ దిశగా ఆలో చనలు చేస్తున్నామని వెల్లడించా రు.

పార్ల మెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్‌ను(BRS) 14 సీట్లలో గెలిపిస్తే దేశంలో తెలంగాణ తడాఖా చూపిస్తానని అన్నారు. శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. దేశ రాజకీయాలపై బీజేపీ, కాంగ్రెస్ విధానాలపై కీలక వ్యాఖ్యలు చేశా రు. దేశంలో సన్‌ఫ్లవర్(Sun flower gang)గ్యాంగ్ ఎక్కువైందని విమర్శించారు. కాంగ్రె స్‌లోకి వెళ్లిన వారంతా వాళ్ల స్వార్థం కోసం వెళుతున్నారని కేసీఆర్ విమర్శించారు. లక్ష మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా బీఆర్ఎస్‌ పార్టీని ఏమీ చేయలేరన్నారు. గో బెల్స్ బతికి ఉంటే బీజేపీని చూసి చచ్చిపోయేవాడని వ్యాఖ్యానించా రు. బీజేపీ(BJP)మళ్లీ వస్తే పెట్రోల్(Petrol), డీజిల్ ధర రూ. 400లకు పెరుగుతుం దన్నారు. దళితులు, గిరిజనుల మాటనే బీజేపీ నోట రాదని విమ ర్శించారు.

మోడీ దుర్మార్గ ప్రధాన మంత్రి అని మోడీవి అన్నీ జుటా మాటలు అని దుయ్యబట్టారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అన్ని జుటా మాటలని విమర్శించారు. మోడీ మాటలు అన్ని వట్టి గ్యాస్, ట్రాష్ అన్నారు. మోడీ కాలంలో నిరుద్యోగం మాత్రం బాగా పెరిగిందని, విద్వేషపు చర్య లు తప్ప దేశానికి ఆయన చేసింది ఏమి లేదన్నారు.తెలంగాణకు ఎండ పెట్టి గోదావరి నీళ్లను ఎవరికో ఇస్తాం అంటున్నారని, ఈ కాంగ్రెస్ దద్దమ్మల పాలనలో నాగార్జున సాగర్ మీదకు మనం వెళ్లలేని పరిస్థితి వచ్చిందని తెలంగాణ ప్రజలనుద్దేశించి కేసీఆర్ అన్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు దాటవన్నారు. అందుకే మోడీ చొక్కాలు, కమీజ్ లు చింపు కుంటున్నారని విమర్శించారు. అదే సమయంలో కాంగ్రెస్ పరిస్థితి దిగ జారిందన్నారు. ప్రాంతీయ పార్టీల కూటమి దేశాన్ని పాలించే స్థాయికి ఎదుగుతుందన్నారు.

 

బీజేపీకి ఈ రాష్ట్రంలో వన్ ఆర్ నన్ సీట్స్ వస్తా యని, సౌత్ ఇండియాలో(South India) బీజేపీ కి పది సీట్లు కూడా రావన్నారు. కాంగ్రె స్ పార్టీ తెలంగాణలో తొమ్మిది స్థా నాల్లో మూడో స్థానంలో ఉందన్నా రు. ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే హైద రాబాద్ రెండో రాజధాని కావాలని అనడం దుర్మార్గం అని కేసీఆర్ ఖండించారు. అలాంటి పిచ్చి వాళ్ల కు ఇక్కడ స్థానం ఇవ్వొద్దంటూ ఘా టైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డా రు. టంగ్ ట్విస్టింగ్‌ మోడీకి వచ్చి నంతగా ఎవరికీ రాదన్నారు. బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా ముస్లిం రిజర్వేషన్లు తొలగించడం తప్పు అని ఖండించారు. 26 నుంచి 33 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని కేసీ ఆర్ చెప్పారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ ఎస్‌గా మారుస్తారా అనే విషయంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.

బీఆర్ఎస్‌ పార్టీ బీఆర్ఎస్‌గానే ఉంటుందని, అవకాశం వస్తే తానూ పీఎం రేసులో ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. తమ పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్ సురేష్ రెడ్డిని(Suresh Reddy) నియమి స్తామ న్నారు. జిల్లాలలను తొలగిస్తాం అనే దెబ్బ కూడా కాంగ్రెస్ మీద పడుతుం దన్నారు.ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ కేసుపైనా కేసీఆర్ స్పందిం చారు. రాష్ట్రంలో వంద మంది డీసీపీలు ఉన్నారని, అందు లో ఒక్కడు రాధా కిషన్ రావు అని, అసలు ఎవరీ రాధాకిషన్ రావు అని వ్యాఖ్యానించారు. సీఎంకు ఫోన్ ట్యాపింగ్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఫోన్ ట్యాపింగ్ చేయ డం లేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. అంతేకాదు నిర్ణీత వ్యవధి తర్వాత ట్యాపింగ్ రికార్డ్స్ ధ్వంసం చేయొ చ్చు అనే చట్టం కూడా ఉందన్నా రు. ఇక లిక్కర్ స్కామ్ కేసు(Liquor scam case ) మోదీ సృష్టించిన రాజకీయ కుంభ కోణం అని ఆరోపించారు కేసీఆర్. బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయడానికి పో లీసులను ఢిల్లీ బీజేపీ ఆఫీస్‌కు పంపించామని, అప్పటి నుంచే తమపై కక్ష కట్టారని ఆరో పించారు కేసీఆర్. తన కూతురు కవితను కక్షతోనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టార న్నారు. కానీ, కవిత కడిగిన ము త్యంలా బయటకు వస్తుం దన్నారు.

 

BRS party wins 14 seats in Telangana