Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRSkcr : తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు

BRSkcr: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి శు భాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి రైతులకు, వ్య వసాయానికి ప్రత్యే కమైన పండుగ. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలం గాణ వ్యవసా యానికి పండుగ శోభ సంతరించుకుంది. దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసా యానికి, రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే.

రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపడం ద్వారా మాత్ర మే సంక్రాంతి శోభ ద్విగుణీకృత మవుతుంది. రైతుల జీవితాల్లో వెలుగులు కొన సాగాలనే దీవించా లని ప్రకృతి మాతను ప్రార్థించిన కేసీఆర్.రైతు పండుగ సంక్రాంతి పర్వదినాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్ష లు తెలిపా రు.భోగీతో ప్రారంభమై, మకర సంక్రాంతి, కనుమతో మూడు రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగ వ్యవసాయాధారిత పల్లె సంస్కృతిలో ప్రత్యేకతను చాటు కుంటుందని పేర్కొన్నారు.

పండిన పంటల రాశులతో ఇండ్లు కళకళలా డుతుండగా, రైతు జీవి తాల్లో సం క్రాంతి శోభ నిండుదనాన్ని సంతరిం చుకుంటుందని తెలి పారు. రంగవ ల్లులతో, భోగి మంటలతో, గొబ్బె మ్మలతో, గంగిరెద్దుల ఆటలతో, పిల్లలు, పెద్దలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ప్రకృతి పం డుగ మకర సంక్రాంతి అని కేసీఆర్ పేర్కొన్నారు.నూతన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగ కావాలని, పాడి పంటల తో రైతు కుటుంబాలు సంతోషంతో నిండా లని, నాటి బీఆర్‌ఎస్ ప్రభు త్వం అనేక పథకాలు ప్రారంభించిందని చెప్పారు.

వ్యవసాయం, దాని అను బంధ రంగాల అభివృద్ధి, రైతు సంక్షే మమే తొలి ప్రాధాన్యతగా నాడు అమలు చేసిన కార్యాచరణ పదేళ్ల అనతి కాలంలో సత్ఫలితాల నిచ్చిందని వివరించారు.అందులో భాగంగా 24 గంటల ఉచిత నాణ్య మైన విద్యుత్తు, ప్రాజెక్టులు, కాల్వల ద్వా రా సాగునీరు, పంటలకు పెట్టుబడిగా రైతుబంధు, రైతు కుటుంబా లకు భరోసాగా రైతు బీమా వంటి పథకాలను పటిష్టంగా అమలు చేశామని తెలిపారు.

తద్వారా సాధించిన వ్యవసాయ ప్రగతి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రశంసలు పొందిందని, దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు.వ్యవసాయానికి ద న్నుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన కులవృత్తు లకు గతంలో లేని విధంగా బీఆర్‌ఎ స్ ప్రభుత్వం అందించిన ప్రోత్సా హం, ఆర్థిక సహకారం స బ్బండ కు లాల జీవితాల్లో సంక్రాంతి శోభ నింపిందని అన్నారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు నాలుగున్నర లక్షల కోట్ల రూపా యలను వ్యవసా య రంగ అభివృద్ధికి ఖర్చు చేసిందని వివరించా రు. రైతు జీవితాల్లో వెలుగులు నింపాలనే ధృఢసంకల్పంతో ముందు కు సాగామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న తెలంగాణ వ్యవసా యం, బీఆర్‌ఎస్ హయాంలో పండుగలా మారిందని కేసీఆ ర్ పున రుద్ఘాటించారు.

రాజకీయాలకు అతీతంగా రైతన్న సంక్షేమమే ధ్యేయంగా, రాజీపడ కుండా పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని సూ చించారు.తద్వారా రైతు పండుగ సంక్రాంతి వేడుకలకు వన్నె చేకూ ర్చిన వార మవుతామని అన్నారు. రైతన్నల జీవితాల్లో వెలుగులు కొనసాగాలం టూ ప్రకృతిమాతను ఈ సందర్భంగా ప్రార్థించారు.