విశ్వశిల్పి రామప్ప రమణీయత పుస్తకావిష్కరణ
Brsmlc: ప్రజా దీవెన , హైదరాబాద్: తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ సంయుక్త సంచాలకులు కన్నెకంటి వెంకట రమణ రాసిన వ్యాసా ల సంపుటి ‘కాకతీయుల గురించి మరికొంత…’ అనే పుస్తకాన్ని రాష్ట్ర శాసన మండలి లో ప్రతిపక్ష నేత, మాజీ స్పీకర్ సిరి కొండ మధుసూదనాచారి ఆదివారం ఆవిష్కరించా రు. విశ్వ బ్రాహ్మ ణ ధర్మ పీఠం స్వర్ణో త్సవాలు నాంపల్లి లోని తెలుగు విశ్వవిద్యాల యంలోని ఆడిటోరి యంలో నేడు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్సీ సిరికొండ మ ధుసూదన చారి, కాకతీయుల గురిం చి మరికొంత అనే పుస్తకం తో పాటు, విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం సంచాలకులు చొల్లేటి కృష్ణమాచా ర్యులు రచించిన ‘విశ్వ శిల్పి రామ ప్ప రమణీయ శిల్పకళ’ అనే చా రిత్రక నవలలను కూడా ఆవిష్కరిం చారు. ఈసందర్బంగా మధు సూదనాచారి మాటాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో కుల వృత్తులు ము ఖ్యంగా విశ్వబ్రాహ్మణల వృత్తులు బాగా దెబ్బతిన్నాయని అన్నా రు. ప్రస్తుతం డబ్బు, రాజ్యాధికారం సమాజాన్ని శాషిస్తున్నాయని అన్నా రు.
విశ్వబ్రాహ్మణ జాతిని అభ్యుద య పథంలో నడిపించడా నికి విశ్వ బ్రాహ్మణ ధర్మపీఠం ఒక మార్గ దర్శ కంగా పనిచేయాలని సూచిం చా రు. ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవి ద్యాలయం మాజీ రిజిస్ట్రార్, విశ్వా బ్రాహ్మణ ధర్మపీఠం సభాపతి డా. త్రిమూర్తుల గౌరీశంకర్, పద్మ శ్రీ కూ రెళ్ల విటలాచార్య, వేలు ఆనందా చారి, డాక్టర్ వేముల వాడ మదన్మో హన్, డాక్టర్ లాలుకోట వెంకటా చా రి, దైవజ్ఞ శర్మ, కుందా రపు గణే ష్ చారి, నారోజు మనోరమ, చిలుకూరి లక్ష్మి తది తరులు పాల్గొన్నారు.