–హత్యకు దారి తీసిన వివా హేతర సంబంధం
Nome murder : ప్రజా దీవెన నకిరేకల్: వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తిని చెట్టు కట్టేసి చితక్కొట్టి దారుణ హత్య చేసిన సం ఘటన నకిరేకల్ మండలం నోముల గ్రామంలో చోటు చేసుకున్న ది. గ్రామస్తులు బంధువులు తెలిపి న వివరాల ప్రకారం.నోముల గ్రా మానికి చెందిన నర్సింగ్ జానయ్య (34) అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని ఏళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగు తున్నది. గతంలో జానయ్య పై కేసు నమోదు అయినట్లు పోలీసులు చెబుతున్నారు. అయినా వీరి మధ్యలో ప్రవర్తన మారకపోవడం తో శుక్రవారం జానయ్యను అదే గ్రామానికి చెందిన నాగరాజు ధనలక్ష్మిలు జానయ్యను చెట్టు కట్టేసి కళ్ళల్లో కారం చల్లి మర్మం గాలపై కట్టేతో కొట్టి రక్తాలు చిందే వరకు స్పృహ కోల్పోయే వరకు చితక్కొట్టి దారుణ హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో భయాందోళనకు గురిచేసింది. గ్రామస్తులు ఎవరు దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఉంది.
ఈ విషయాన్ని ఆ బంధువులకు చెప్పడంతో వారు వచ్చి చెట్టు కట్టేసిన జానయ్య ను విడి పించారు. అంబులెన్సులో నకిరేకల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి జాన య్యను తరలించారు. ప్రథమ చికిత్స చేసి కండిషన్ సీరియస్ ఉండటంతో నల్లగొండ జిల్లా ఆసు పత్రికి రిఫర్ నల్గొండకు తీసుకు వెళుతున్న సమయంలో మా ర్గమధ్యలో జానయ్య మరణిం చారు. వారి బంధువులు శోకసము ద్రంలో ఉన్నారు. ఆస్తుల కోసం, డ బ్బుల కోసమే,పక్క ప్రణాళిక ప్ర కారమే జానయ్యను హత్య చేశార ని బంధువులు ఆరోపిస్తున్నారు. వారి తల్లి నర్సింగ్ ప్రమీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నకిరేకల్ ప ట్టణ సీఐ రాజశేఖర్ తెలిపారు. అ న్ని కోణాలలో విచారణ చేసి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని సీఐ తెలిపారు.