–రూ.2.8–2.9 లక్షల కోట్ల మొత్తం లో బడ్జెట్ కు సిద్ధం
–ఉదయం 9కి మంత్రివర్గంభేటీ, బడ్జెట్కు ఆమోదముద్ర
–మధ్యాహ్నం12కు అసెంబ్లీలో ప్రవే శపెట్టనున్న భట్టి, మండలిలో శ్రీధ ర్బాబు
–వ్యవసాయ రంగానికే అధిక నిధు ల కేటాయింపు
–ఆగస్టు 2 వరకు కొనసాగనున్న బడ్జెట్ సమావేశాలు
–పలు బిల్లుల ఆమోదం క్రమంలో పొడిగింపు
–ప్రతిపక్ష నేత హోదాలో నేడు తొలి సారి అసెంబ్లీకి రానున్న కెసిఆర్
Budget in Assembly:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Govt) గురువారం శాసనసభలో 2024–25 సంవ త్సరానికిగాను పూర్తి స్థాయి బడ్జె ట్ను ప్రవేశపె ట్టనుంది. ప్రతిష్ఠాత్మక పథకాలు, ఆరు గ్యారెంటీలకు నిధు ల కేటాయింపు, సబ్సిడీలు, అప్పు ల కిస్తీల చెల్లింపు, ఉద్యోగుల వేత నాలు వంటి అన్ని అంశాలనూ పరి గణలోకి తీసుకుని దాదాపు రూ.2. 8 లక్షల కోట్ల నుంచి రూ.2.9 లక్షల కోట్ల మధ్య బడ్జెట్ను రూ పొందించి నట్లు చెప్పుకుంటున్నారు. గురు వారం ఉదయం 9 గంటలకు అసెం బ్లీలోని కమిటీ హాల్–1లో జరగ నున్న భేటీలో బడ్జెట్కు క్యాబినెట్ (Cabinet for Budget)ఆమోద ముద్ర వేయనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యు త్తు శాఖల మంత్రి మల్లు భట్టి విక్ర మార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడ తారు. శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవే శపెడతారు. ఈసారి కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు వస్తే బడ్జెట్ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యో చించింది.
ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎ ఫ్) కింద రూ.2,250 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు, పాలమూ రు, రంగారెడ్డి సాగునీటి పారుదల ప్రాజెక్టుకు కేంద్ర పథకాల కింద నిధు లు వస్తాయని ఆశించింది. ఈ నిధు లతో కలిపి రాష్ట్ర బడ్జెట్ను పెంచా లనుకున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపడంతో రాష్ట్ర రాబడులపైనే ఆధారపడి బడ్జెట్ను ఖరారు చేసినట్లు సమాచారం.ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్కారు రూ.2, 75,891 కోట్లతో ‘ఓట్–ఆన్– అకౌం ట్’ బడ్జెట్ను ప్రవేశపెట్టి ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల వ్యయాల కోసం రూ.78,911 కోట్లకు శాసన సభ ఆమోదం పొందిన సంగతి తెలిసిం దే. ఆగస్టు నుంచి చేసే వ్యయాలకు శాసనసభ అనుమతి పొందాల్సి ఉన్నందున ఈ నెల 31లోపు బడ్జె ట్ను ఆమోదించుకునే దిశగా రేవం త్ సర్కారు అసెంబ్లీ సమావేశాలను (Assembly meetings) నిర్వహిస్తోంది.
వ్యవసాయానికే (For agriculture) సింహభా గం… ఈ బడ్జెట్లో ఒక్క వ్యవ సాయ రంగానికే దాదాపు రూ.50 వేల కోట్లకు పైగా కేటాయించినట్టు సమాచారం. అందులో రైతు రుణ మాఫీ పథకానికి రూ.31 వేల కోట్లు, రైతు భరోసాకు మరో రూ.15 వేల కో ట్లు, రైతు బీమాకు రూ.7 వేల కోట్ల వరకు కేటాయించవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత విద్యుత్తు, సాగునీటి పారుదల శాఖలకు నిధులను ఎక్కువగా కేటాయిం చినట్టు సమాచారం. విద్యుత్తు సంస్థల బకాయిల చెల్లింపు, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు వంటివాటికి నిధుల కేటాయింపు దృష్ట్యా విద్యుత్తు శాఖకు భారీగానే కేటాయింపులు జరిపినట్లు తెలిసిం ది.
ఇక రాష్ట్రంలో పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, దేవాదుల ఎత్తిపోతల పథకాలు కొనసాగుతు న్న నేపథ్యంలో సాగునీటి రంగానికీ ప్రాధాన్యమిచ్చింది. కాంగ్రెస్ ప్రభు త్వ ఆరు గ్యారెంటీలకు కూడా భారీ గానే నిధులను కేటాయించినట్లు తెలిసింది.రాష్ట్ర రాబడుల్లో జీఎస్ టీ, విలువ ఆధారిత పన్ను, స్టాంపు లు, రిజిస్ట్రేషన్లపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. వీటి ద్వారా వచ్చే రాబడులే రాష్ట్రాన్ని గట్టెక్కి స్తాయని నమ్ముతోంది. బడ్జెటేతర అప్పులకు కేంద్రం మోకాలడ్డు తుండడంతో ఎఫ్ఆర్బీఎం పరిమి తికి లోబడి బడ్జెట్ అప్పులను తీసుకోవాల్సి వస్తోంది. ఓటాన్ అకౌంట్ (account) బడ్జెట్లో రూ.68,585 కోట్ల అప్పులు తీసుకుంటామని సర్కారు ప్రతిపాదించిందిన సంగతి విదిత మే. పూర్తి స్థాయి బడ్జెట్లో కూడా అప్పులు అంతే ఉండనున్నాయి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, కాంట్రి బ్యూషన్ల కింద గత బీఆర్ఎస్ ప్రభు త్వం 41 వేల కోట్లను ప్రతిపాదించిం ది. కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.21 వేల కోట్ల నే ప్రతిపాదించింది. పూర్తి స్థాయి బడ్జె ట్లోనూ (budget) అంతే మొత్తాన్ని ప్రతిపాదించవచ్చని సమాచారం.