*పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి కథలపుస్తకాలుపునాదులు: సుబ్బారావు
Burle Nageswara Rao : ప్రజా దీవేన, కోదాడ:పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి కథల పుస్తకాలు పునాదులు వేస్తాయని కోదాడ పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు, సాహితీవేత్త విశ్రాంత అధ్యాపకులు మంత్రి ప్రగడ భరతారావు, మచ్చ వెంకట నరసయ్య లు అన్నారు.
ఆదివారం కోదాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో చందమామ కథ రచయిత బూర్లే నాగేశ్వరరావు రచించిన అపరంజిత పిల్లల కథల పుస్తకాన్ని వారు ఆవిష్కరించి మాట్లాడారు. బాల సాహిత్య అభివృద్ధికి బూర్లే నాగేశ్వరరావు చేస్తున్న కృషిని ప్రశంసించారు. నాగేశ్వరరావు చందమామ కథలు పిల్లల్లో నైతిక విలువల పెంపుకు దోహదపడతాయన్నారు పిల్లలు కథల పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలని సూచించారు.
కోదాడ రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోదాడ రచయితల సంఘం అధ్యక్షులు పుప్పాల కృష్ణమూర్తి, కోశాధికారి సేకు శ్రీనివాసరావు, విశ్రాంత ఉద్యోగుల సంఘం కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, నాగేశ్వరరావు కూతురు శ్రీదేవి అల్లుడు బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.