ప్రజా దీవెన, శాలిగౌరారం: జాతీయ మానవ హక్కుల మం డలి ఆధ్వర్యంలో మండలి ఛైర్మెన్ సంపత్, రాష్ట్ర ఛైర్మెన్ బుర్ర రమేష్ ఆదేశాను సారం శాలిగౌరారం మండలం నూలగడ్డ కొత్తపల్లి గ్రామం లో నిరుపేద వృద్దులకు దుప్పట్లు, చీరలు, స్నాక్స్ పంపిణి చేశారు.
దాతల సహకారం తో జాతీయ మానవ హక్కుల మండలి ఉమ్మడి జిల్లా కన్వీనర్ వీపూరి పరాంకుశం, జిల్లా కాంగ్రెస్ నాయకులు కట్టగూరి సురేందర్ రెడ్డిలు పంపిణి చేశారు.ఈ కార్యక్రమం లో సిరుపంగి పరమేష్, ఓగోటి యాదయ్య, సిరుపంగి సత్యం, తిరుమలేష్, అనిల్, గుడపురి దావీదు, యాదయ్య, తిరుపత్తయ్య పాల్గొన్నారు