Burri Srinivas Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ మున్సిపాలిటీ సమగ్ర అభి వృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా ర్గ దర్శనంలో కట్టుబడి ఉన్నా మని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని పానగల్ రోడ్డు 19 వ వార్డులోని అమూల్య కాలనీలో పార్కు సుందరీకరణ మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్ముల మో హన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కౌన్సిలర్ గోగుల రాములమ్మ లతో కలసి శంకుస్థాపన చేశారు. అమూల్య కాలనీ పార్కు అభివృద్ధికి, సర్వాం గ సుందరంగా తీర్చిదిద్దడానికి మరియు కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి మున్సిపల్ నిధుల నుండి కేటాయించామని తెలిపా రు. పానగల్ రోడ్డు ప్రాంతం శరవే గంగా విస్తరిస్తున్నందున నూతనం గా ఏర్పడిన కాలనీలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సహకారంతో చేపట్టి నట్లు తెలిపారు. నల్లగొండ పట్ట ణంలో అంతర్గత డ్రైనేజీల నిర్మా ణం మొదటగా 19 గా వార్డులోనే ప్రారంభించి దాదాపు పూర్తి దశకు చేరుకున్నాయని తెలిపారు. అండ ర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టిన కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణం కూ డా పూర్తి చేస్తామని తెలిపారు.
నల్లగొండ మున్సిపాలిటీని గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంక టరెడ్డిసహకారంతో అభివృద్ధి పథం లో తీసుకుపోవడానికి భవిష్యత్తు లో మరోమారు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని పట్టణ ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ సంద ర్భంగా మున్సిపల్ పాలకవర్గం విజయవంతంగా పూర్తి అవుతున్న సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ గోగుల రాములమ్మ గార్లను అమూల్య కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పీఏ మధుసూదన్ రెడ్డి, వార్డు నాయకులు గోగుల గణేష్,కొప్పు శ్రీకాంత్, కొండేటి నరేష్,నర్సిరెడ్డి, కొప్పు కృష్ణ , యాట వీరారెడ్డి, విజయ్,శేషు కుమార్, సుజాత, స్వప్న,ప్రసన్న, రేణుక, అమూల్య కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అంబటి అంజయ్య, ఉపాధ్యక్షులు తరాల పరమేశ్ యాదవ్, సలహాదారులు కక్కిరేణి శ్రీనివాస్, తండు భానుప్రకాష్ గౌడ్, గుండగోని యాదయ్య, లక్ష్మణమూర్తి, రేణుక, కున్ రెడ్డి నర్సింహారెడ్డి, కాస్పరాజు సైదులు, శంకర్ బాబు, భుజంగరావు, వీరారెడ్డి, ముక్కాముల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.