C.M Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్ రెడ్డి ఆపన్న హస్త అందిం చారు. ప్రసార మాధ్యమాల్లో విష యాన్ని తెలుసుకున్న సీఎం రేవంత్ కండరాల వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకోలేకపోతున్న నిరుపేద యువకుడు గూళ్ల రాకేష్ గురించి తెలుసుకుని చలించిపో యారు. తక్షణమే రాకేష్కు కావా ల్సిన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉచి తంగా వైద్యం అందించడంతో పా టు రాకేష్ కోసం ఛార్జింగ్ వాహనా న్ని కూడా అందించాలని ముఖ్య మంత్రి సూచించారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎం ఓఎస్డీ వే ముల శ్రీనివాసులు రాకేష్ కుటుం బీకులతో ఫోన్లో మాట్లాడారు.
ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకుంటామని సీఎం తరఫున హామీ ఇచ్చారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రం గయ్య పల్లి గ్రామానికి చెందిన గూ ళ్ల రాకేష్ చాలా కాలం సూడో మ స్య్కులర్ డిస్ట్రోఫీ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు.
ఇటీవల వ్యాధి తీవ్రత పెరగడంతో నడవలేని పరిస్థితికి వచ్చాడు. రాకే ష్కు ఆరోగ్యం మెరుగు కావాలంటే ఖరీదైన ఇంజక్షన్లను క్రమం తప్ప కుండా ఇవ్వాలని వైద్యులు సూచిం చారు. పేదరికంలో ఉన్న రాకేష్ కు టుంబం ఖరీదైన వైద్యం చేయించ లేకపోతుందని పత్రికలో వచ్చిన క థనంపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణ మే స్పందించారు. తమ బిడ్డను ఆ దుకోవడానికి స్పందించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి రాకేష్ తల్లి దండ్రులు గూళ్ల సమ్మయ్య, లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు.