C.M Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ లో ఇసుక అక్రమ రవా ణాను అరికట్టడానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలతో సంచలన ప్రకటన చేశారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాల ని, రీచ్ల వద్ద వెంటనే తనిఖీలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదే శించారు. అక్రమ రవాణాకు పాల్ప డితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై ముఖ్యమం త్రి ఉన్నతస్థాయి సమావేశంలో స మీక్షించి అధికారులకు పలు ఆదే శాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణా కు అడ్డుకట్ట వేసే బాధ్యతను హై డ్రాకు అప్పగించారు.ఇందిరమ్మ ఇం డ్లకు ఇసుకను ఉచితంగా అందిం చేలా చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. సామాన్య వినియోగదా రులకు తక్కువ ధరకు ఇసుకల భించేలా చర్యలు తీసుకోవాలన్నా రు. అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదని హె చ్చరించారు.ఆ విషయంలో ఎవ్వ రినీ ఉపేక్షించేది లేదని చెబుతూ అ వసరమైతే తానే స్వయంగా ఆకస్మి క తనిఖీలు చేస్తానని చెప్పారు. అ క్రమాలకు తావులేకుండా పారద ర్శకంగా జరగాలని, విధి నిర్వహ ణలో పర్మనెంట్ ఉద్యోగులకు బా ధ్యతలు అప్పగించాలంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధి కారులకు పలు సూచనలు చేశారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు ఇసుకను అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసు కోవాలని, ఇసుక రవాణా పర్యవేక్ష ణకు ప్రత్యేక అధికారులను నియ మించాలి. అందుకు జిల్లాల వారిగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలి. అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి రీచ్ వద్ద 360 డిగ్రీల కెమెరా లు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయా లని, ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేయాల ని స్పష్టం చేశారు.
రవాణాకు సం బoధించి రిజిస్టర్డ్ లారీలను ఎం ప్యానెల్ చేయాలని, ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదా రుడికి చేరేలా చర్యలు తీసుకోవా లన్నారు. ప్రాంతాల వారిగా సమీప రీచ్ల నుంచి వినియోగదారుడికి ఇ సుక చేరేలా వ్యవస్థ ఏర్పడాలని ఆకాంక్షించారు. సమస్య తలెత్తిన ప్పుడు వెంటనే పరిష్కారం జరగా లని, వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏ ర్పాటు చేయాలని, పెండింగ్ బిల్లు లను వెంటనే చెల్లించాలని అధికా రులను ఆదేశించారు. నిర్ణీత ధర కు మాత్రమే ఇసుక అమ్మకాలు జ రిగేలా చర్యలు తీసుకోవాలి. ఇసు క రవాణా చేసే వాహనాలకు ట్రా కింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వే యాలన్నారు. ఆన్లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పులు జర గాలని, ఆఫీస్ టైమింగ్స్లో బుకింగ్ చేసుకునేలా బుకింగ్ వేళల్లో మా ర్పు చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఖనిజా భివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.