Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cancer: క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తించొచ్చు

–భారత్ లో త్వరలోనే అందుబా టులోకి సాంకేతిక పరిజ్ఞానం
–జాతీయ స్థాయి అడ్వాన్స్ క్యాన్స ర్ డయాగ్నోసిస్ సదస్సులో ఎయి మ్స్ న్యూరో సర్జన్ డాక్టర్ రేఖపల్లి రాజశేఖర్
Cancer:ప్రజా దీవెన, మంగళగిరి: క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తించే టెక్నాలజీ (technology)త్వరలో భారత్ లో అందుబాటు లోకి రానుందని మంగళగిరి ఎయిమ్స్ న్యూరో సర్జన్ డాక్టర్ రేఖపల్లి రాజశేఖర్(Rekha palli rajshekhar) అన్నారు. మంగళవారం స్థానిక కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో జరిగిన జాతీయ స్థాయి ట్రెండ్స్ ఇన్ ఎపిజెనిక్స్ ఇన్ క్యాన్సర్ డయాగ్నోసిస్ మరియు థెరఫి (cancer diagnostic and therapy)అనే పేరుతో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయి క్యాన్సర్ (cancer)డయాగ్నోసిస్ , థెరఫి గురించి వివరించారు. వర్శిటీ ప్రో చాన్సులర్ డాక్టర్ కెఎస్.జగన్నాథరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎం.జానకిరామయ్య లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.

అనంతరం డాక్టర్ రేఖపల్లి రాజశేఖర్ (repali Rajasekhar)మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించడానికి ధేశ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారని తెలిపారు. ముఖ్యంగా బయోటెక్నాలజీతో కృత్రిమ మేథస్సును అనుసంధానం చేయడం ద్వారా రక్తంలో క్యాన్సర్ కణాలను ముందుగానే గుర్తించి క్యాన్సర్ రోగుల(cancer patients) ప్రాణాలను కాపాడేందుకు భారత్ లో శాస్త్రవేత్తలు స్వదేశీ పరిజ్ఞానంతో నూతన టెక్నాలజీకి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఖచ్చితత్వంతో క్యాన్సర్ కణాలను ఎలా చంపాలి.., ?క్రిస్పరు కాస్ నైన్ సాంకేతికతతో ఉత్పత్తి చేయబడిన ఎలుకలను క్యాన్సర్ ప్రయోగాలకు ఎలా ఉపయోగించాలి అనే అంశాల గురించి ఆయన బయోటెక్నాలజీ , వైద్య విద్యార్దులకు విపులంగా వివరించారు.

ప్రో చాన్సులర్ డాక్టర్ కెఎస్.జగన్నాథరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలను, ఇండస్ట్రీ బాగస్వాములను, విద్యార్దులను ఒకే వేదికపైన చేర్చామని అన్నారు. తద్వారా క్యాన్సర్ పైన జరుగుతున్న పరిశోధనలలో మంచి ఫలితాలను రాబట్టవచ్చునని అన్నారు. 2023 ఐసిఎమ్మార్ నివేధిక ప్రకారం రానున్న కాలంలో క్యాన్సర్ వృద్ది రేటు గణనీయంగా పెరుగుతుందని ఆంధోళన వ్యక్తం చేశారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎం.జానకిరామయ్య మాట్లాడుతూ క్యాన్సర్ ను సమూలంగా నిర్మాలించాలనే కార్యాచరణతో, ఎఎన్ఆర్ఎఫ్, కేంద్ర పరిశోధనా సంస్థ అయిన సెర్బ్ ఆర్ధీక సహకారంతో ఈ జాతీయ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు.

ఈ సదస్సు వలన విద్యార్దులు క్యాన్సర్ పైన విస్తృత స్థాయిలో పరిశోధనలు చేయడానికి ఉపయోగ పడడంతో పాటు క్యాన్సర్(cancer )పరిశోధనలలో ఆధునిక టెక్నాలజీని అనుసంధానం చేయడం ఎలా అనే విషయాలు స్పష్టంగా అర్దమవుతాయని అన్నారు. మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ రాయల సురేష్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ బయో మార్కర్ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్ధ సారధి వర్మ, ప్రో చాన్సులర్ డాక్టర్ కెఎస్.జగన్నాథరావు, ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఎవిఎస్.ప్రసాద్, అకడమిక్స్ డాక్టర్ కె.రాజశేఖరరావు, డాక్టర్ ఎన్.వెంకట్ రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగ డీన్ డాక్టర్ కె ఆర్ఎస్.ప్రసాద్, హైదరాబాదుకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ అంజనాదేవి, డాక్టర్ షేక్ నౌషద్, సదస్సు కన్వీనర్ డాక్టర్ ఎం.జానకిరామయ్య, బయోటెక్నాలజీ విభాగాధిపతి, కో కన్వీనర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, కోశాధికారులు కోటేశ్వర రెడ్డి, జ్ఞాన శేఖరన్ తదితరులు పాల్గొన్నారు.