CDP Dhanalakshmi : ప్రజా దీవెన ములుగు:ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మం డలంలో సిడిపిఓగా విధులు నిర్వ హిస్తున్న ధనలక్ష్మి మంగళవారం ఉదయం కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యా యత్నం చేసుకుంది. అంగనవాడి టీచర్ల పట్ల అసభ్యక రంగా ప్రవర్తిస్తుందని, కావాలని అంగన్వాడి టీచర్లు తనపై జిల్లా కలెక్టర్ కు తప్పుడు సమాచారం ఇవ్వడంతో అధికారులు తనను సస్పెండ్ చేశారని, దీంతో మనస్థా పానికి గురైన తాను ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నట్టు తెలు స్తుంది.
ఆమెను హుటా హుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తర లించగా వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆందోళన పడవలసిన అవసరం లేదన్నారు. సంఘటనకు సంబంధించిన మరింత సమాచా రం తెలియవలసి ఉంది.