*కాంగ్రెస్ 8 బిజెపి 8 గెలిచినా ఫలితం శూన్యం
*టిఆర్ఎస్ తోనే సమున్నత అభివృద్ధి
*కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్న
central budget:ప్రజా దీవెన, కోదాడ: పార్లమెంటులో టిఆర్ఎస్ పార్టీ (TRS party in Parliament)ఎంపీలు లేకపోవడం వల్లనే కేంద్ర బడ్జెట్లో (central budget) తెలంగాణకు తీవ్రస్థాయిలో అన్యాయం జరిగిందని బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు పచ్చిపాల వేణు యాదవ్ స్పష్టం చేశారు బుధవారం కోదాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉన్నప్పటికీ టిఆర్ఎస్ పాలన హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ఎంపీలు పార్లమెంటులో మాట్లాడి హక్కులు సాధించుకున్నారని పేర్కొన్నారు.. అయితే ఇప్పుడు బిజెపి కాంగ్రెస్ (BJP Congress)కలసి 16 ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన రాష్ట్రానికి ఒక పైసా కూడా విడుదల చేయకపోవడం కాంగ్రెస్ బిజెపి ఎంపీల అసమర్ధతను తెలియజేస్తుందన్నారు… సంకీర్తన ప్రభుత్వాలలో ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరిగా అవసరమవుతుందని గత లోక్సభ ఎన్నికల్లో ఉద్యమ నేత కేసిఆర్ పదేపదే ప్రజలకు వివరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు, భవిష్యత్తులోనైనా టిఆర్ఎస్ తోనే రాష్ట్ర హక్కుల సాధ్యమని ప్రజల భావిస్తున్నారని పేర్కొన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిందని అయితే ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు ఈ అంశాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు… ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను సమీకరించి పోరాట నిర్వహిస్తామన్నారు