Chairman Gutta Sukhender Reddy : ప్రజా దీవెన నల్గొండ టౌన్ :శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఉరుమడ్ల గ్రామానికి చెందిన పాకాల రాములమ్మ కు 40 వేల రూపాయలు, పెండెంల మీనయ్య కోడలు సంధ్య కు 33 వేల రూపాయల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ స్కీం తమలాంటి పేద ప్రజలకు వరం లాంటిది అన్నారు. ఈ చెక్కులు అందజేసిన శాసన మండల చైర్మన్ సుఖేoదర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమమం లో సీనియర్ నాయకులు పల్లపు బుద్ధుడు, సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, ఉద్యమ నాయకులు జనపాల శ్రీను, యువ నాయకులు పాకాల దినేష్, మర్రి రమేష్, ఉయ్యాల నరేష్, పోలగోని శంకర్, పాకాల బాలరాజు, పాకాల చిన్న బచ్చయ్య, పాకాల మల్లయ్య, గంగాపురo వెంకన్న, పాకాల రమేష్, వసుకుల స్వామి, తదితరులు పాల్గొన్నారు.