Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cherlapalli Central Jail: విడుదలకు వేళాయే..!

–సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు రంగం సిద్ధం
–నేడు విడుదల కానున్న మొత్తం 213 మంది ఖైదీలు
–ఖైదీల విడుదల జీవో జారీ చేసిన హోం శాఖ కార్యదర్శి

Cherlapalli Central Jail: ప్రజాదీవెన, హైదరాబాద్: చనికావేశంలో తెలిసి తెలియక చేసే తప్పులకు శిక్ష అనుభవిస్తూ శిక్షాకాలంలో సత్ప్రవర్తన కలిగిన నిందితుల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జైలులో (Jail) ఇలాంటి వివాదాలకు తావు లేకుండా క్రమశిక్షణతో ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళని విడు దల చేసేందుకు కసరత్తు పూర్త యింది. ఈ మేరకు చర్లపల్లి జైలు అధికారులు మొత్తం 213 మంది ఖైదీలు బుధవారం సాయంత్రం వరకు కల్లా విడుదల చేయనున్నా రు. ఇందుకు సంబంధించి హోం శాఖ (home department)కార్యదర్శి జీవో నెంబర్ 37 ను సైతం జారీ చేశారు. విడుదలయ్యే వారిలో జీవిత ఖైదీలతో పాటు ఇతర శిక్షపడిన ఖైదీలు ఉన్నట్లు హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ (jitender)ఆ ఉత్తర్వులలో పేర్కొ న్నారు. చైల్డ్ శాఖ అత్యున్నత స్థాయి కమిటీ మొత్తం 231 మంది ఖైదీలను విడుదలకు సిఫారసు చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదన లను పంపడంతో 213 మంది ఖైదీల విడుదలకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆమోదముద్రవేశారు. ముందుగా విడుదల కానున్న ఈ ఖైదీలకు కొన్ని షరతులు విధి స్తున్నట్లు ఆ జీవోలో పేర్కొన్నారు.

ప్రతి ఖైదీ బయటకు వెళ్ళిన తర్వా త శాంతియుతంగా సత్ప్రవర్తన కలిగి ఉంటానని లేదంటే తిరిగి శిక్ష అనుభవిస్తానని రూ.50 వేలకు వ్య క్తిగత పూచికత్తుతో బాండ్ ఇవ్వా ల్సి ఉంటుంది. గతంలో విధించిన శిక్షాకాలం పూర్తయ్యే వరకూ వారి గ్రామ పరిధిలోని పోలీస్ స్టేషన్‎లో (police station)ప్రతి మూడు నెలలకు ఒకసారి హాజరు కావలసి ఉంటుందని పేర్కొన్నారు. మళ్ళీ ఏదైనా నేరం చేస్తే రద్దు చేసిన శిక్ష తిరిగి అమలు చేస్తారు. జిల్లా అధికారి సదరు ఖైదీ ని గమనిస్తూ ఉండడంతో పాటు ఆ ఖైదీ విడుదలైన జైలుకు ఆరు నెలలకు ఒకసారి రిపోర్టును కూడా సమర్పించాలని ఆ జీవోలో (jio) పేర్కొ న్నారు. అయితే ప్రభుత్వం ఆదే శాల మేరకు త్వరలో 213 మంది ఖైదీలు విడుదలకు జైళ్ల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. విడుదల కాబోతున్న 213 మంది ఖైదీలను చర్లపల్లి సెంట్రల్ జైలుకు (cherlapalli Central Jail)తీసుకు వచ్చి అక్కడ వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వృత్తినైపుణ్య శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఈ మొత్తం అధికారిక ప్రక్రియ పూర్తయిన తర్వాత విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.