Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chief Minister Revanth Reddy : భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగు ణంగా డ్రైపోర్ట్

–ఆర్ఆర్ఆర్ ప‌నులు మరింత వేగ‌వంతం చేయాలి
–ఎన్‌హెచ్‌ల భూ సేక‌ర‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాలి
–ఆర్ఆర్ఆర్‌, ఎన్‌హెచ్‌ల‌పై స‌మీక్ష‌ లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

Chief Minister Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్‌: భవిష్యత్ లో రానున్న వందేళ్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా డ్రైపో ర్ట్‌కు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ము ఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారు ల‌కు సూచించారు. ఆర్ఆర్ఆర్ స‌ మీపంలో స‌రైన ప్రాంతంలో డ్రైపోర్ట్ ఉండాల‌ని సీఎం అన్నారు. రాష్ట్రం లో జాతీయ ర‌హ‌దారుల నిర్మా ణం ఆర్ఆర్ఆర్ ప‌నుల పురోగ‌తిపై ఐ సీసీసీలో ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించా రు. ఇటీవ‌ల రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న అంశాల‌పై ఢిల్లీలో జ‌రిగిన తెలంగా ణ‌, ఏపీ అధికారుల స‌మావేశంలో హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి అవ‌స‌ర‌మైన డీపీఆర్ తయారీకి సూత్రప్రాయ ఆ మోదం తెల‌పాల‌ని కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి ఆదేశించిన నేప‌థ్యంలో ఆ ప‌నుల‌పై దృష్టిసారించాల‌ని సీఎం సూచించారు.

రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్త‌ర భాగానికి సంబంధించిన‌ భూ సేక‌ర‌ణ పూర్తి చేయాల‌ని,ద‌క్షిణ భా గం డీపీఆర్ క‌న్స‌ల్టెన్సీ నివేదిక‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. హైద‌రాబాద్ న‌గ‌రా న్ని ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాజ‌ధాని రాయ్‌పూ ర్‌తో అనుసంధానించేలా జాతీయ ర‌హ‌దారికి ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేసి జాతీయ ర‌హ‌దారుల ప్రాధి కార సంస్థకు (ఎన్‌హెచ్ఏఐ) పం పించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూ చించారు. హైద‌రాబాద్ నుంచి మం చిర్యాల వ‌ర‌కు కొత్త జాతీయ ర‌హ‌ దారి నిర్మాణానికి సంబంధించి ప్ర‌తి పాద‌న‌లు త‌యారు చేయాల‌ని సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల ని ర్మాణానికి సంబంధించి భూసేక‌ర‌ ణ‌లో ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌పై సీఎం ఆరాతీశారు. ప‌లు చోట్ల పం ట‌లు ఉన్నాయ‌ని, పంట న‌ష్ట‌ప‌రి హారం చెల్లించేందుకు ఎన్‌హెచ్ఏఐ అంగీక‌రించ‌డం లేద‌ని అధికారులు సీఎంకు వివ‌రించారు. పంట కాలం దాదాపు పూర్త‌వుతున్నందున ఆ వెంట‌నే రైతుల‌తో మాట్లాడి భూ సేక‌ర‌ణ పూర్తి చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

భూ సేక‌ర‌ణ‌కు సంబంధించి ఏవై నా స‌మ‌స్య‌లుంటే ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడాల‌ ని, సాంకేతిక‌, న్యాయ స‌మ‌స్య‌లు ఉంటే వాటి ప‌రిష్కారానికి కృషి చే యాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కా ర్య‌ద‌ర్శి శాంతి కుమారికి ముఖ్య‌ మంత్రి ఏ.రేవంత్ రెడ్డి సూచించా రు. ఔట‌ర్ రింగు రోడ్డు నుంచి రీజి న‌ల్ రింగు రోడ్డు వ‌ర‌కు రేడియ‌ల్ రోడ్లు ఆర్ఆర్ఆర్‌ నుంచి తెలంగా ణ స‌రిహ‌ద్దుల వ‌ర‌కు ఉన్న ర‌హ‌ దారుల విస్త‌ర‌ణ‌పైనా ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని సీఎం అన్నారు. స‌మీ క్ష‌లో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు శ్రీ‌నివాస‌రాజు, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ఆర్ అండ్ బీ ప్ర‌త్యేక ము ఖ్య కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి హ‌రిచంద‌న‌, ముఖ్య ఇం జినీర్లు తిరుమ‌ల‌, జ‌య‌భార‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.