బిగ్ బ్రేకింగ్, తెలంగాణ కొత్త సిఎస్ గా కె,రామకృష్ణారావు ?
chiefsecretary: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణా రావును నియ మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమా చారం. 1989 బ్యాచ్ కు చెందిన ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి 20 21 జనవరి నుంచి సిఎస్ గా వ్యవహరిస్తున్నారు.
ఆమె పదవి కాలం వచ్చే నెలతో ముగియనుంది ఈ నేపథ్యంలోనే తదుపరి సి ఎస్ గా కె, రామకృష్ణా రావు, పేరును ఖరారు చేసినట్లు స మాచారం.1990 బ్యాచ్ ఐఏఎస్కు చెందిన రామకృష్ణారావు తె లంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తు న్నారు.
రామకృష్ణారావు వచ్చే ఆగస్టులో రిటైర్కానున్నారు. ప్రస్తుతమున్న ఐఏఎస్ల్లో శశాంక్గోయల్తరువా త సీనియర్గా రామకృష్ణారావు ఉ న్న విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ లో ఆయన చేసిన సేవలు, ఆర్థికం గా రాష్ట్రాన్ని ముందుకు నడిపించ డంలో ఆయనకున్న అ నుభవం తొడ్పడుతుందని ఉద్దేశంతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆయనను సీఎస్గా నియమించాలనే ఆలోచ న చేసినట్లుగా సమా చారం.
రామకృష్ణారావు గతంలో నల్గొండ జాయింట్కలెక్టర్గా, గుంటూరు కలె క్టర్గా పనిచేశారు. ప్రస్తుత సీఎస్శాంతి కుమారి తన సర్వీసుకు వీఆ ర్ఎస్ తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా తెలిసింది. ఆమె వీఆర్ ఎస్నిర్ణయాన్ని వచ్చేవారం ప్రకటిం చనున్నట్లుగా సమాచా రం.
దీంతో కొత్త సీఎస్గా కె,రామకృష్ణా రావును నియమించేందుకు ప్రభు త్వం నిర్ణయించినట్లుగా సమాచా రం. వాస్తవంగా శాంతి కుమారి ఈ నెలఖరున పదవీ విరమణ చేయ నున్నారు. అంత కంటే ముందుగా నే ఆమె వీఆర్ఎస్తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలిసింది.
వీఆర్ఎస్ తరువాత శాంతి కుమారిని చీఫ్ ఇన్ఫర్మేషన్కమిషనర్గా నియమించనున్నట్లుగా కూడా ప్ర చారం జరుగుతోంది. ఆమె నియా మకం ఇప్పటికే ఖరారు అయిందని, కేవలం అధికారిక ప్రక్రియ మాత్ర మే జరగాల్సి ఉందని తెలిసింది. వచ్చే వారం సమాచార కమిషనర్ లకు సంబంధించిన నియామక స మావేశం జరగనున్నట్లుగా తెలి సింది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్ష తన జరిగే సమావేశంలో ఆమెతో పాటు మరికొందరు సమాచార కమిషనర్లుగా నియమించను న్న ట్లుగా తెలిసింది.