–సిఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరు
–నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరు మర్తి లింగయ్య
Chirumarthi Lingaiah: ప్రజా దీవెన, నార్కట్ పల్లి: రుణ మాఫీ విషయంలో మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేట ని,సిఎం రేవంత్ పచ్చి అబద్ధాల కోరు అని, రైతులనే కాదు దేవుళ్ళ ను కూడా మోసం చేస్తున్నాడని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) ధ్వజమెత్తారు. శుక్రవారం నాడు నార్కట్ పల్లి లోని బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో విలే రుల సమావేశంలో మాట్లాడారు.ఆగష్టు 15 నాటికి రాష్ట్రంలోని రైతులకు రూ.31 వేలకోట్ల రుణ మాఫీ చేస్తామని ఉదరగొట్టి అందు లో రూ.9 వేల కోట్లు కోత పెట్టిన ఘనుడు రేవంత్ రెడ్డి(revanth reddy) అని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోని యాగాంధీ పుట్టినరోజు కానుకగా డిసెంబర్9 నాటికి రూ.40 వేల కో ట్లు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి నని, అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపారని ఆగస్టు 15 వరకు రూ. 31 వేల కోట్లు మాఫీ చేస్తానని అ న్నారని వెల్లడించారు.అసెంబ్లీ ఎన్ని కల నుంచి పార్లమెంట్ ఎన్నికల స మయానికి రూ.9 వేల కోట్లను కోత పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిదని (revanth reddy) నిప్పులు చెరిగారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని హరీష్ రావు స్పీకర్ రాసిన లేఖలో స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు అరకోర రుణమాఫీ చేసి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించా రు. ఏట్లో దుకాల్సింది హరీష్ రావు(Harish Rao) కాదని, మాట తప్పినందుకు రేవం త్ దూకాలని డిమాండ్ చేశారు. 2 లక్షల రుణమాఫీ చేయాలని, లే కుంటే రేవంత్ కు దేవుళ్ళు, ప్రజలు, రైతులు తగిన శాస్త్రి చేస్తారని హెచ్చరించారు. రుణమాఫీ మోసం త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారని స్పష్టం చేశారు.