Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chirumarthi Lingaiah: యాభై శాతం రుణమాఫీ కానేకాలే

–ఉమ్మడి జిల్లాలో శాతం మించని రైతు రుణమాఫీ
–మూడో విడత తర్వాత నేటి వర కు ఏ ఒక్కరికి కాలేదు
— నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Chirumarthi Lingaiah: ప్రజా దీవెన, నకిరేకల్: ఉమ్మడి జిల్లాలో మూడు విడతల్లో కలిపి ఆరు లక్షల మంది రైతులు రుణ మాఫీకి అర్హులుగా అంచనా వేయ గా కేవలం 3.39 లక్షల మంది రైతు లకు రుణమాఫీ (Loan waiver for farmers ans)జరిగిందని, ఇంకో రెండున్నర లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తు న్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) ఆందోళన వ్యక్తం చేశారు.డిసిసిబి పరిధిలోని సహకార బ్యాంకులో రుణమాఫీ ని పరిశీలిస్తే 58 శాతం మందికే రుణ మాఫీ వర్తించిందన్నారు. డీసీసీబీ లో మొత్తం 90 వేల మంది రైతులు రుణమాఫీకి అర్హులు కాగా 52,0 00 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని తెలిపారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాల ని డిమాండ్ చేస్తూ నార్కట్ పల్లి మండల కేంద్రంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఆయ న మాట్లాడుతూ డీసీసీబీలో రూ.5 00 కోట్ల రుణమాఫీ కోసం అధికా రులు ప్రత్తిపాదనలు ప్రభుత్వానికి పంపిస్తే రూ. 280 కోట్లు మాత్రమే చేశారని వివరించారు.

రేషన్ కార్డు ప్రామాణికంగా కుటుంబంలో ఒకరి కి మాత్రమే రెండు లక్షల వరకు రు ణమాఫి వర్తింప చేయడం వల్లనే జనాలకు ఈ సమస్యలు ఉత్పన్న మయ్యాయి ఆరోపించారు. రేషన్ కార్డు లేని వారందరికీ నేటి వరకు రుణమాఫీ రాలేదు. వీళ్ళ కోసం గత నెల రోజులుగా సర్వే నిర్వ హిస్తున్న ఇప్పటివరకు అది పూర్తి కాలేదన్నారు. ఒక నల్గొండ జిల్లా లోని పరిశీలిస్తే అధికారులు చెప్పిన లెక్కల ప్రకారమే 45 వేల మంది రేషన్ కార్డు లేక రుణమాఫీ కానీ రైతులు ఉంటే ఇప్పటికి 25 వేల మంది సర్వేనే పూర్తి అయిందన్నా రు. సర్వేల పేరుతో కాలయాపన తప్ప రుణమాఫీ జరిగింది లేదని, దాదాపు రెండు నెలలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లక్షల మంది రైతులు పొలాలు వదిలిపెట్టి రుణమాఫీ కోసం బ్యాంకుల చు ట్టూ అధికారుల చుట్టూ తిరిగి తిరి గి వేసారి పోతున్నారని ఆందో ళన వ్యక్తం చేశారు. గత ఆగస్టు 15 తర్వాత ఇప్పటివరకు కొత్తగా ఒక రైతుకు రుణమాఫీ కాలేదని, బ్యాం కు ఖాతా వివరాలు, పట్టాదారు పాస్ పుస్తకాల వివరాలు, ఆధార్ కార్డు పేర్లలో తప్పులు ఇలాంటి వాటి కరెక్షన్స్ ఇంకెప్పుడు జరుగు తాయో చెప్పేవారు కరువయ్యారని విమర్శించారు.

గతంలో కేసీఆర్ సర్కార్ (KCR Sarkar) ఎలాంటి షరతులు లేకుం డా అర్హులైన రైతులందరికీ రూ.99, 999 వరకు రుణమాఫీ చేసిందని,
అప్పుడు కెసిఆర్ సర్కారు ఒక్క రూపాయి తక్కువ లక్ష రూపా యల(99999) వరకు రుణమాఫీ చేస్తేనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల మంది రైతులకు 2159 కోట్ల ప్రయోజనం జరిగిం దన్నారు. కానీ నేడు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే కూడా 3.39 లక్షల మందికే ప్రయోజనాలు కలిగిందని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ సర్కారు (Congress Govt) అనేక కొర్రీలు పెడుతూ రైతులను ఇబ్బం దులకు గురిచేస్తుందని అర్ధం అవుతుందని అనుమానం వ్యక్తం చేశారు.ఇక వా నాకాలం సీజన్ ప్రారంభంలో ఇవ్వా ల్సిన రైతు భరోసా కు నేటికీ అడ్రస్ లేదని ఎద్దేవా చేశారు. గతంలో కేసీ ఆర్ సర్కార్ హయాంలో ఉమ్మడి జిల్లాలో ఒక్కో సీజన్ లో దాదాపు రూ. 1300 కోట్ల రూపాయలు రైతు లకు రైతుబంధు కింద అందేవని, నేడు వానకాలం సీజన్ మరో మూ డు రోజుల్లో ముగిస్తున్నా సరే రైతు భరోసా అతిగతి లేదన్నారు.

అక్టోబర్ నుంచి యాసంగి సీజన్ (Yasangi season)ప్రారం భం కానుంది. రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడు తుందని, రుణమాఫీని, పూర్తిగా చేయకుండా రైతు భరోసా ఇవ్వ కుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని, ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆంక్షలు లేని రుణమాఫీని వర్తింప చేయాలని, అందరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే వానకాలం రైతు భరోసా తోపాటు యాసంగి రైతు భరోసాని కూడా రైతుల అకౌంట్ లో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్ర మంలో జిల్లా నాయకులు రేగట్టే మల్లిఖార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.