ప్రజాదీవెన, నల్గొండ క్రైమ్
మామిడాల గ్రామానికి చెందిన గజ్జి లింగయ్య మరియు గజ్జి చంద్రయ్య ఇద్దరు సొంత అన్నధమ్ములు వారి ఇరువురికీ మద్య గత కొంత కాలముగా భూమి తగాదాలు నడుస్తున్నాయి, వీరికి తిప్పర్తి మండలం, మామిడాల గ్రామ పరిది లోని సర్వే నంబర్ 155 నందు భూమి విషయంలో లింగయ్య కుటుంబ సభ్యులకు (నిందితులు) మరియు చంద్రయ్య కుటుంబ సభ్యులకు (బాధితులకు) చాలా రోజుల నుండి తగాదాలు జరుగుతున్నవి.
అట్టి భూమి పంచాయతీ విషయంలో గతంలో పెద్ద మనుషులలో మాట్లాడుకున్నా వినకుండా, పదే పదే ఇరువురి కుటుంబాల సమక్షంలో భూమి కబ్జా కొరకు గొడవలు జరుగుతుండటం వలన పైన తెల్పిన నిందితులు, చంద్రయ్య కుటుంబ సభ్యులకు చంపి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని అవకాశం కోసం ఎదురుచూస్తు 10.12.2024 రోజు చంద్రయ్య కుటుంబ సభ్యులను వారి పొలం దగ్గర పొలం పనులు లలో ఉండగా పైన చూపబడిన నిందితులు ముందస్తుగా గా వేసుకున్న పథకం ప్రకారం చంద్రయ్య భార్య మరియు అతని ముగ్గురు కుమారులు పై మరియు కోడళ్ళు పై కారం చల్లి విచక్షణ రహితంగా గొడ్డళ్ళు, కర్రలతో దాడి చేయగా రక్తపు గాయాలు అయ్యి గట్టిగా కేకలు వేయడంతో ప్రక్క పొలంలో నాటు వేయడానికి వచ్చిన కూలీలు వారి వద్దకు పరుగెత్తుకుంటూ వస్తుండటం గమనించి వారు అక్కడ నుండి పారిపోయినారు.గజ్జి శంకర్ తండ్రి చంద్రయ్య ఫిర్యాది మేరకు తిప్పర్తి పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేసినాము.
గాయపడిన వారి వివరాలు గజ్జి శంకర్,గజ్జి సైదులు, గజ్జి రామలింగం,గజ్జి విజయలక్ష్మి మరియు గజ్జి లక్ష్మి కాంతం., గజ్జి సత్తమ్మ తీవ్ర గాయాలతో నల్గొండ లోని ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.విచారణ అనంతరం గజ్జి లింగయ్య, గజ్జి పద్మ, గజ్జి శంకర్, గజ్జి గణేశ్, గజ్జి సందీప్, యెర్పుల నాగయ్య, గట్టిగొర్ల లింగస్వామి, జక్కలి నాగయ్య (8 మందిని ) ను అరెస్టు చేసి వీరి వద్ద నుండి రెండు గొడ్డళ్ళు, నాలుగు కర్రలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినాము.
పొలం పంచాయితీలు మరియు గెట్టు పంచాయితీలు ఉన్నట్లయితే మీరు గ్రామ పెద్దల సమక్షములో సామరస్య పూర్వకముగా లేదా గౌరవ సివిల్ కోర్టు డైరక్షన్ ప్రకారం నడుచుకోవాలి, ఎట్టి పరిస్థితులలో కూడా భూమి పై కబ్జా కలిగి ఉన్నవారిని ఎలాంటి కోర్టు ఉత్తర్వులు లేకుండా నేర ఉద్దేశ్యం తో గోడవలకు దిగి చట్టాని అతిక్రమించినట్లయితే సదరు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును. ఇట్టి హత్య ప్రయత్నం కేసును త్వరిత గతిన పూర్తి చేసి ఎనమిది మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచిన, శాలిగౌరారం సి.ఐ కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో, తిప్పర్తి యస్.ఐ. బి. సాయి ప్రశాంత్ వారి సిబ్బందిని డి.యస్.పి అభినందించారు.