Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CI Rajasekhar Reddy : మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయం

— ప్రతియేటా ఉచిత మోకాలు చిప్ప ఆపరేషన్లు చేయడం అభినందనీయం

–ఎంవిఎన్ ట్రస్ట్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలి

— సీఐ రాజశేఖర్ రెడ్డి

CI Rajasekhar Reddy : ప్రజాదీవెన నల్గొండ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమని, ఆమె అందించిన పోరాట స్ఫూర్తిని, మానవత విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏ.రాజశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం నల్లగొండలోని సత్యావతి హాస్పిటల్ లో మల్లు స్వరాజ్యం మూడవ వర్ధంతి సందర్బంగా ఆమె మనవడు, ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ మల్లు అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక నిరుపేద మహిళకు ఉచిత మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరైన సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మల్లు స్వరాజ్యం జీవితమంతా త్యాగాలమాయం అంటూ జీవితాంతం నిరుపేదల కోసం అభ్యున్నతి కోసం పరితపించారని గుర్తు చేశారు. ఆమె చరిత్రను మర్చిపోకుండా భవిష్యత్ తరాలకు అందించేందుకు ఆమె పేరుతో నిర్వహించే సేవా కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. ప్రతీ యేటా వర్ధంతి సందర్బంగా నిర్వహిస్తున్న ఉచిత మోకాలు మార్పిడి ఆపరేషన్ అభినయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు.


మల్లు స్వరాజ్యం మనవడు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు మల్లు అరుణ్ రెడ్డి మాట్లాడుతూ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం తన జీవితాన్ని అట్టడుగు వర్గాల కోసం ధరపోసిన గొప్ప వనిత అన్నారు. మహిళా హక్కులు, ప్రజల హక్కులు, పేదల భూముల కోసం చివరి వరకు జీవించారని గుర్తు చేశారు. స్వరాజ్యం మూడు సంవత్సరాల కిందట చనిపోయారని, ఆమె పేరుతో ప్రతీ యేటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నల్లగొండ లోని సత్యవతి హాస్పిటల్ సహకారంతో మిర్యాలగూడ కు చెందిన కార్మిక సంఘం నేత నకిరేకంటి అంజయ్య సతీమణి మరియమ్మకు బుధవారం విజయవంతంగా మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్ చేసినట్లు వెల్లడించారు. గొప్ప వ్యక్తుల స్ఫూర్తిని ముందుకు తీసుకు పోయేందుకు ఇలాంటి కార్యక్రమం దోహద పడతాయని భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్ లోనూ మరింత ముందుకు తీసుకుపోతామని, ఇందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్న సత్యవతి హాస్పిటల్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. సత్యావతి హాస్పిటల్ ఎండి డాక్టర్ రాంమనోహర్ మాట్లాడుతూ స్వరాజ్యం స్ఫూర్తిగా ఎన్నో కార్యక్రమాలు ప్రతీ సంవత్సరం చేయడం చాలా సంతోషకరమన్నారు. అందులో మా సత్యవతి హాస్పిటల్ భాగస్వామ్యం కావడం ఇంకా సంతోషంగా ఉన్నదని, మేము కూడా అనేక సేవా కార్యక్రమల్లో పాల్గొంటున్నామని చెప్పారు. ఉచిత మెడికల్ క్యాంపు లు, నిరుపేదలకు ఉచిత సర్వీస్ కూడా అందిస్తున్నామని వివరించారు.

ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వాహక కార్యదర్శి పీ. నర్సిరెడ్డి మాట్లాడుతూ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతినెల మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని అలాగే మల్లు వెంకట్ నరసింహ రెడ్డి, మల్లు స్వరాజ్యం వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు ఉచిత మోకాలు చిప్ప మార్పిడి నల్లగొండలోని సత్యవతి హాస్పిటల్ లో వారి మనవడు మల్లు అరుణ్ కుమార్ రెడ్డి చేస్తున్నారని చెప్పారు. డాక్టర్ అరుణ్ కి సత్యవతి హాస్పిటల్ యజమాన్యానికి ఎంబీఏ విజ్ఞాన కేంద్రం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైద్య సేవలే కాకుండా విద్యార్థులకు కరాటే ఉచిత కంప్యూటర్ శిక్షణ, మహిళలకు టైలరింగ్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. మా సంస్థ చేస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ మహిళ మరియమ్మ కుమారుడు మాట్లాడుతూ మా అమ్మ కు ఉచిత ఆపరేషన్ చేయడం జీవితంలో మరచిపోలేమన్నారు. స్వరాజ్యం పేరుతో ఇలాంటి ఉచిత సర్వీస్ చేస్తున్న వారి మనవడు డాక్టర్ మల్లు అరుణ్ రెడ్డి, సత్యవతి హాస్పిటల్ డాక్టర్ రాం మనోహర్, ఎంవిఎన్ ట్రస్ట్ నిర్వహకులకు ప్రత్యేక కృతజ్ఞతలన్నారు.
ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం నిర్వాహకుడు పుచ్చకాయల నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్సై శంకర్, డాక్టర్ చైతన్య, డాక్టర్ సంపద, సత్యవతి వైద్యశాల ఎండి. సత్యనారాయణ, కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్యాకల్టీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.