CI Rajasekhar Reddy :ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మానసిక స్థితి కోల్పోయిన ఒక ఒక వృద్ధుడు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న సమయంలో స్థానికులు సిఐ కి సమాచారం అందించడంతో తక్షణమే స్పందించి ఆ వృద్ధుడికి రాత్రి భోజనం ఉదయం అల్పాహారం ,బట్టలు, దుప్పటి ఏర్పాటు చేసి అన్నపూర్ణ సేవా సమితి వారికి సమాచారం అందించి సూర్యాపేటలోని మానసిక వికలాంగుల కేంద్రం ఆశ్రమము వారితో మాట్లాడి జిల్లా వయోవృద్ధుల శాఖ ద్వారా సూర్యాపేట అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ కి పంపించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా వయోవృద్ధుల శాఖ అధికారి నాగిరెడ్డి అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షులు రాజు వన్ టౌన్ పోలీస్ కానిస్టేబుల్స్, సామాజిక కార్యకర్త భీమనపల్లి శ్రీకాంత్, గణేష్ ,సునీల్, తదితరులు పాల్గొన్నారు.