Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Relief Fund: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 18: నాంపల్లి మండలం పరిధిలోని కేతేపల్లి గ్రామానికి చెందిన పల్లేటి వసుమతికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా విడుదలైన 60000 రూపాయల చెక్కును కేతేపల్లి మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు కోరే యాదయ్య మంగళవారం రోజున కుటుంబానికి అందించారు.

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా నాంపల్లి మండలం పేద ప్రజలకు ఆదుకుంటున్నారని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు మా మండలానికి సహకరిస్తున్న శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డికి కేతేపల్లి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పగిళ్ల ఈదయ్య పెరికే టి జగన్ వడ్లకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు