–వ్యవసాయరంగానికి పెద్దపీఠ –ప్రపంచాన్ని ఆకర్షించేలా ప్రభు త్వం ప్రణాళికలు
–స్వయం ఉపాధి పథకాలకు బ్యాం కర్స్ తో కలిసి 6వేల కోట్లు
–మార్చి 2న వనపర్తిలో సీఎం రేవం త్ రెడ్డి ప్రారంభిస్తారు
–బ్యాంకర్స్ త్రైమాషిక సమావేశం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
CM Revamth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రైజింగ్ తెలంగాణలో బ్యాంకర్స్ పాత్ర కీలకమని, ప్రపంచాన్ని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్ర వారం ఆయన బేగంపేటలో ఏర్పా టుచేసిన బ్యాంకర్స్ త్రైమాషిక సమావేశంలో ప్రసంగించారు.
స్కిల్ యూనివర్సిటీ, ఐటిఐ ల అడ్వాన్స్మెంట్ ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులను, రెప్పపాటు కూడా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా, శాంతి భద్రతలు మంచి వాతావరణం కల్పించి ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా దావోస్ లో 1.80 లక్షల కోట్ల పెట్టుబడుల కు ఒప్పందాలు జరిగాయని తెలి పారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చె ప్పడమే కాదు చేసి చూపామని తెలిపారు. ఈ ఒక్క రంగానికి 52,000 కోట్లు కేటాయించామని తెలిపారు. రెండు నుంచి మూడు నెలల వ్యవధిలోనే రైతు రుణమా ఫీ కింద సుమారు 22 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామ న్నారు. భారతదేశ చరిత్రలో ఇది ఒక రికార్డు అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులతో పాటు బ్యాం కర్లకు మేలు జరిగిందని, సింగిల్ ఖాతా ద్వారా 22 వేల కోట్లు బ్యాం కుల్లో జమ అయ్యాయని, సింగిల్ స్ట్రోక్ తో పెద్ద మొత్తంలో బ్యాంకర్ల కు రికవరీ జరిగిందని బ్యాంకర్లు ప్రభుత్వాన్ని అభినందించాలి అన్నారు. రైతు భరోసా పథకం కింద ఇప్పటికే 11,500 కోట్లు, రైతు బీమా కింద 1,500 కోట్లు, రైతుల కు ఉచిత విద్యుత్తు పథకం కింద సబ్సిడీ మొత్తం 11 వేల కోట్లు, సన్నధాన్యం బోనస్ గా 1,800 కోట్లు, ఇవి కాకుండా కేంద్ర ప్రాయో జిత పథకాలు, వివిధ రాష్ట్ర ప్రభు త్వ పథకాల కింద రైతులకు ప్రయో జనం చేకూరుతుందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెంది తేనే రాష్ట్రం బాగా వృద్ధి సాధిస్తుం దని ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న ట్లు తెలిపారు.గత పది సంవత్సరా లు పాలించిన వారు సంక్షేమరం గాన్ని మూలన పడేశారని అన్నా రు.
ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన స్వయం ఉపాధి పథకాలకు తిరిగి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించిన ట్లు తెలిపారు. స్వయం ఉపాధి ప థకాలు, సంక్షేమ రంగానికి బ్యాంక ర్లతో కలిసి రాబోయే రెండు నెలల్లో 6,000 కోట్లు ఖర్చు చేయనట్టు తెలిపారు. మార్చి 2న వనపర్తి లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ స్వయం ఉపాధి పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. ఇవి రాష్ట్ర జిడిపిని పెం చేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. దేశ ఆలోచనను ముం దుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలతో సోలా ర్ విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్టు తెలిపారు. వెయ్యి మెగావాట్లు ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ కంపెనీ లతో ఎంఓయూ కుదుర్చుకున్నట్టు వివరించారు. మహిళలను ప్రోత్స హించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. హైదరాబాద్ నగరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నా రు, హైదరాబాదు నగరానికి మూ సీ నది మణిహారంగా రాష్ట్ర ప్రభు త్వం భావిస్తుందని వివరించారు. మూసీ నదిని పునర్జీవింపజేసి ఆదాయంతో పాటు, పరిసరాల్లో నివసించే వారి ఆరోగ్యాన్ని పరిర క్షించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నా రు. మూసీ నది అభివృద్ధి క్రమంలో నిర్వాసితులు అయ్యే వారికి బ్యాం కర్లు ఆర్థికంగా చేయూతను అందిం చాలన్నారు. మూసి నిర్వాసిత మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం అన్నారు. ఏడాది 20వే ల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందించినట్టు తెలిపా రు. కోటి మంది జనాభా ఉండే హై దరాబాద్ నగరంలో మహిళలకు ఆర్థిక చేయూత ఇస్తాం అన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో ఇండస్ట్రియల్, ఫార్మా, హౌసింగ్ క్లస్టర్లు పెద్ద ఎత్తున అభివృద్ధి చే స్తాం అన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే రాష్ట్రంలోకి పెద్ద ఎత్తు న పెట్టుబడులు వెల్లువెత్తుతాయి అన్నారు. ప్రపంచాన్ని ఆకర్షించే ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది అన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే MSME సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు బ్యాంకర్లు ఆర్థిక చేయుత అందిం చాలి అన్నారు. రాష్ట్రంలో అభివృ ద్ధి కొన్ని ప్రాంతాలకు పరిమితం కా కుండా అన్ని ప్రాంతాలు, వర్గాలు అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అన్నారు. వీట న్నిటిని దృష్టిలో పెట్టుకొని బ్యాంక ర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవా లని బడ్జెట్ కు ముందు ఈ సమావే శం నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. 10 సంవత్సరాల తర్వాత సంక్షేమం, అభివృద్ధి జోడె డ్లుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందుకు అనుగుణంగా బ్యాంకర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డి ప్యూటీ సీఎం తెలిపారు.