CM Revanth : బిగ్ బ్రేకింగ్, ఒకే వ్యక్తి, ఒకే పార్టీ విధానాలను ఉమ్మడిగా వ్యతిరేకిం చాలన్న సీఎం రేవంత్
CM Revanth : ప్రజా దీవెన హైదరాబాద్: భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ను, గ్యారంటీలను రక్షించుకునేందు కు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావా లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కాంక్షించారు. ఫెడరల్ స్ఫూర్తికి వి ఘాతం కలిగించే ‘ఒకే వ్యక్తి.. ఒకే పార్టీ..’ తరహా విధానాలను ఉమ్మ డిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రఖ్యాత మలయాళీ దినపత్రిక మాతృభూమి వారు తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన “మాతృభూమి ఇంటర్నేషన ల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్” సదస్సు లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అలాగే, మాతృభూమి ఎడిటర్ మనోజ్ కె.దాస్, కొందరు సభికులు ముఖా ముఖి అడిగిన ప్రశ్నలకూ ముఖ్య మంత్రి సమాధానాలిచ్చారు. దశా బ్దాలపాటు కుటుంబ నియంత్రణ విధానాలు పాటించి, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే స్థితిలో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి దక్షిణాదిని శిక్షిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యుత్తమంగా రాష్ట్రాన్ని నిలబె ట్టేలా తెలంగాణ రైజింగ్ నినాదంతో సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి కార్యా చరణ తీసుకున్నామన్నారు. హైద రాబాద్ ను విశ్వనగరంగా తీర్చిది ద్దే ప్రణాళికలను ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ కేంద్రంగా మారుతోంది. ఇటీవల దావోస్ ప్ర పంచ ఆర్థిక వేదిక సదస్సులో రా ష్ట్రానికి రూ.1.82 లక్షల కోట్ల వి లువైన పెట్టుబడులు వచ్చాయ న్నారు. పారిశ్రామిక రంగం అభి వృద్ధితో పాటు అన్ని వర్గాలకు సం క్షేమాన్నీ సమర్ధవంతంగా అమలు చేస్తున్నాం.
ముఖ్యంగా రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సర ఫరా, ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా, భూమి లేని కుటుంబాల కు ఏడాదికి రూ.12 వేలు ఇందిర మ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామని చెప్పారు.పంటలకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. దేశంలో నే రైతులకు రూ.2 లక్షల వరకు రు ణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలం గాణ. 25 లక్షల రైతు కుటుంబాల కు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేశామని తెలిపారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ విధానం. సమగ్ర కుల సర్వే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని పేర్కొ న్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణను అమలుకు పూ నుకున్న తొలి రాష్ట్రం కూడా తెలం గాణే అని గుర్తు చేశారు. ఈ అంశా లను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఫిబ్ర వరి 4వ తేదీని ఏటా ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’గా జరుపుకుంటాం. జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారి టీలకు వనరులు సమకూర్చుతామ న్నారు. సుపరిపాలన ఏడాదిలోనే ఎంత మార్పు తెస్తుందనేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉదాహారణ. కేంద్ర ప్రభుత్వ తాజా ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, తలసరి ఆదాయంలోనూ ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయితే అది భారతదేశ వృద్ధికి ప్ర యోజనం కాదా మరి కేంద్ర ప్రభు త్వం రాష్ట్రాలకు అండగా ఎందుకు ఉండటం లేదు ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు, బీజేపీయేతర ప్రభుత్వా లు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఎందు కు మద్దతుగా నిలవడం లేదని ము ఖ్యమంత్రి ప్రశ్నించారు.