Harish rao: రేవంత్ అబద్దాల కోరు
అసెంబ్లీ ఎన్నికల్లో అలివికాని హామీలు ఇచ్చి అందరూ అనుకున్నట్లుగానే అన్ని వర్గాలను నిలువునా ముంచిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ధ్వజమెత్తారు. ఆరుగ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు.
సీఎం హోదాలో పచ్చి అబద్ధాలు
ఐదు గ్యారెంటీలను అమలు చేశామని బుకాయింపు
అన్ని వర్గాలను అనుకున్నట్లుగానే మోసం చేశారు
చెరో ఎనిమిది స్థానాలు పంచుకు నేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు
మీట్ ద ప్రెస్ లో కాంగ్రెస్ పై హారీశ్ రావు ఆగ్రహం
ప్రజా దీవెన, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో అలివికాని హామీలు ఇచ్చి అందరూ అనుకున్నట్లుగానే అన్ని వర్గాలను నిలువునా ముంచిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish rao) ధ్వజమెత్తారు. ఆరుగ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్(Congress party) పార్టీ మోసం చేసింది అని ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు. సహజంగానే అబద్ధాల కోరు అయినటువంటి రేవంత్ ఆరింటిలో ఐదు హామీలు అమలు చేశామని రేవంత్ చెప్పు కోవడం సుద్ద అబద్ధం అని కొట్టి పారేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కా ర్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్(Congress) ప్రభుత్వం నిలబెట్టుకోలేద న్నారు. మహిళలకు నెలకు రూ.2, 500 ఇస్తామని చెప్పి మోసం చేశా రని ఆరోపించారు.జనవరిలో ఆస రా పింఛన్లు ఇవ్వలేదని దుయ్య బట్టారు. నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశార న్నారు. నిరుద్యోగ భృతి గురించి అసెంబ్లీలో భట్టి అబద్ధాలు చెప్పా రన్నారు. గృహజ్యోతి కింద కేవలం 30 లక్షల మందికే అమలు చేశార న్నారు. రైతులు, మహిళలు, పేదలను, యువత, నిరుద్యోగు లను మోసం చేశారని మండిప డ్డారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నిలబెట్టుకో లేదన్నారు. ఆసరా పెన్షన్లు పెంచు డు మాట ఏమో కానీ కనీసం జనవ రి నెలలో పెన్షన్లే ఇవ్వలేదన్నారు.
ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న మూడు డీఏలు ఇస్తామని మోసం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామా అని జనం బాధపడుతు న్నారని అన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింద న్నారు.కాంగ్రెస్ కు ఎందుకు ఓటేశామా అని జనం బాధ పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందని సెటైర్లు వేశారు. బౌన్స్ అయినందుకు కాంగ్రెస్ను ఈ ఎన్నికల్లో శిక్షించాలని పిలుపు నిచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ పరువు తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి(Revanth reddy) తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో చెరో స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని హరీష్ రావు ఆరోపించారు. 8స్థానా ల్లో గెలిచేలా కాంగ్రెస్, 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచేలా బీజేపీ ఒప్పందం కుదుర్చుకున్నాయని, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించా లని సమైక్యవాదులు అంటున్నా రని తెలంగాణ ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఆరు గ్యారంటీలను అమలు చేశాకే కాంగ్రెస్(congress)ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడ గాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బాండు పేపర్ బౌన్స్ అయిందని, అందుకు శిక్ష వేయాలని ప్రజలను నిర్ణయించా రన్నారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఇప్పుడు దేవుళ్ల పై ప్రామిస్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హామీలు అమలు కావడ డం లేదంటే చెప్పుతో కొట్టాలని దూషిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీకి మూటలు పంపడంలో ఉన్న శ్రద్ధ హామీల అమలుపై పరిపాల నపై లేదన్నారు. రాష్ట్రాన్ని సాధిం చిన కేసీఆర్ను, ఆయన సీనియా రిటీని గౌరవించకుండా రేవంత్ కళ్లు పీకుతా, పేగులు మెడలో వేసుకుం టా అని దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పరిపాలన వికేంద్రీకణ కోసం ఏర్పా టు చేసిన జిల్లాలను రద్దు చేస్తా నంటున్నాడని ఇది ఏ పరిస్థితికి అద్దం పడుతుందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పరిపాలన లేదు, పగ ప్రతీకారాలు కనిపిస్తున్నాయని విమర్శించారు. ప్రజాపాలనలో 3 లక్షల యాభైవేల దరఖాస్తులు వచ్చాయి. ఎన్ని పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాల న్నారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ వాటినే ప్రోత్సహిస్తోం దన్నారు. తెలంగాణ ప్రయోజనా లను కాపాడుకోడానికి బీఆర్ఎస్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నా రని జోస్యం చెప్పారు. బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని, దేశవ్యాప్తంగా 157 మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఇస్తే రాష్ట్రానికి ఒక్కట ఇవ్వలేదని, కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు, నవోదయ స్కూళ్లు ఇవ్వలేదని దుయ్యబ డుతూ వడ్లు కొనాలంటే నూకలు తినండి అని కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.
కేసీఆర్ తెలంగాణను దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చితే వడ్లు కొనకుండా వివక్ష చూపారని, తెలం గాణకు ఏమీ ఇవ్వని బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగు తుందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులు, నిరుద్యోగులు, మహి ళలు ఏ ఒక్క వర్గానికీ బీజేపీ మేలు చేయలేదని, కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, రైతులకు ఉచిత కరెంటు, మెడికల్ కాలేజీలు, కొత్త జిల్లాలు, కేసీఆర్ కింట్, మంచినీళ్లు, తాగు నీళ్లు ఇచ్చిండని గుర్తు చేశారు. నల్లచట్టాలు తెచ్చి లాఠీచార్జి చేసి, బాష్పవాయువు ప్రయోగించి 700 మంది రైతులను పొట్టనబెట్టుకుందని, స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి మోసం చేసిందని, ఎస్సీ వర్గీక రణ చేస్తామని చెప్పారు గాని బిల్లు పెట్టలేదన్నారు.
గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టిందని స్పష్టం చేశారు. కెసిఆర్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా అని హరీష్ ప్రశ్నించారు. అద్భుతంగా యాదాద్రి కట్టింది కేసీఆర్ అని, ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు కొరత రాకుండా చూశారని, ఆధ్యాత్మికంలో ఆయన బీజేపీకంటే రెండు అడుగులు ముందు ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల్లో ఆదరణ లభిస్తోందని, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రె స్, బీజేపీ కంటే బీఆర్ఎస్కే ఎక్కువ వస్తాయని జోస్యం చెప్పారు. నిశ్శ బ్ద విప్లవం రాష్ట్రంలో నెలకొందని, రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నా రని, రాష్ట్రం దివాలా తీసిందనే ముఖ్యమంత్రే చెబితే పెట్టుబులు వస్తాయా అని ప్రశ్నించారు. రేవంత్ మాటల వల్ల రియిల్ ఎస్టేట్ వ్యాపా రం తగ్గిందని, పరిశ్రమలు ఇబ్బం దుల పడుతున్నాయని, కేసీఆర్ హయాంలో నీళ్లు , కరెంటు పుష్క లంగా ఉండంతో ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు.
మీకు పాలన చేత కాక రాష్ట్రాన్నివెనక్కి తీసుకెళ్తు న్నారని, గత ప్రభుత్వంపై బురద చల్లుతూ రాష్ట్రం పరువు తీస్తున్నా రని, రేవంత్ బీజేపీలో చేరతారని అర్వింద్, మహేశ్వర్ రెడ్డి అంటు న్నారని, దీన్ని రేవత్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. కవిత అరస్ట్ కాలేదు కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒకటని అబద్ధాలు చెప్పి మైనారిటీ ఓట్లు సంపాదించు కు న్నారని విమర్శించారు. ఇప్పుడు కవిత అరెస్టయ్యారు, కుక్మక్కయితే ఎందుకు అరెస్ట్ అవుతారన ప్రశ్నంచారు. రేవంత్ మైనారిటీల ను మోసం చేస్తున్నారని, కేబినెట్ లో మైనారిటీని తీసుకోలేదని, రంజాన్ తోఫా నిలిపేశారని, ఇమామ్ వేతనాలు రావడం లేదని, రేవంత్ మోదీని బడే బాయ్ అంటూ ఆశీర్వాదాలు కోరుతు న్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అన్ని వర్గాల పార్టీ ఆని మైనారిటీలకు అన్యాయం జరిగితే పోరాడుతుందని, హిందూ ముస్లిం లను రెండు కళ్లా చూసే పార్టీ బీఆర్ ఎస్ పార్టీ అని బీఆర్ఎస్ను ఆదరిం చాలని ముస్లింలను, క్రైస్తవులను ఇతర మైనారిటీలను కోరుతున్నాన న్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్ర యోజనాలు కాపాడడం బీఆర్ఎస్ తోనే సాధ్యమని హరీష్ రావు స్పష్టం చేశారు.
CM Revanth lies in Parliament elections