Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : పెట్టుబడుల్లో మరో మైలురాయి, ప్ర తిష్ఠాత్మక ఎక్స్‌పోలో సీఎం రేవంత్

CM Revanth Reddy : ప్రజా దీవెన, జపాన్: తెలంగాణ రా ష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణలో మరొక మైలురాయిగా ముఖ్యమం త్రి శ్రీ రేవంత్ రెడ్డి జపాన్‌లో జరిగిన వరల్డ్ ఎక్స్‌పో 2025 (World Ex po 2025) వేదికగా రాష్ట్ర పెట్టుబ డి అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన ప్రతి ష్ఠాత్మక ఎక్స్‌పో 2025 (Expo 20 25 Osaka)లో ముఖ్యమంత్రి సా రథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతి నిధి బృందం భాగస్వామిగా పాల్గొం ది. వివిధ ,రంగాలకు చెందిన వ్యా పారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వారితో సుదీ ర్ఘంగా చర్చించారు.

ఈ వేదికగా ముఖ్యమంత్రి మా ట్లాడుతూ రల్డ్ ఎక్స్‌పో 2025లో భారతదేశం నుంచి మొట్టమొద టిగా పాల్గొన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ఇది గర్వకారణమని తెలిపారు. తెలంగాణ – జపాన్ మ ధ్య ఉన్న చారిత్రక స్నేహ బంధాన్ని దీర్ఘకాలిక భాగస్వామ్యంగా తీర్చిది ద్దుకుందామని పిలుపునిచ్చారు. కొ త్త ఆవిష్కరణలతో భవిష్యత్తు ప్ర ణాళికలను రూపుదిద్దుకునే దిశగా కలిసి పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

సులభతర పారిశ్రామిక విధానం, స్థి రమైన పాలన, ప్రపంచ స్థాయి మౌ లిక సదుపాయాలు తెలంగాణ కు పెట్టుబడులకు ఆకర్షణగా నిలుస్తు న్నాయని ముఖ్యమంత్రి పేర్కొ న్నా రు. “హైదరాబాద్‌కు రండి, మీ ఉ త్పత్తులు ఇక్కడ తయారు చేయం డి, భారత మార్కెట్‌తో పాటు ప్ర పంచ దేశాలకు తెలంగాణను గ మ్యస్థానంగా ఎంచుకోవాలంటూ జ పాన్ కంపెనీలను ఆహ్వానించారు.

తెలంగాణ, జపాన్ మధ్య ఉన్న మంచి సంబంధాలను మరింత బ లోపేతం చేస్తూ, ఒసాకా బేలో సూ ర్యోదయం లాంటి కొత్త అధ్యా యా నికి ఇది నాంది కావచ్చని అభిప్రా యపడ్డారు. తెలంగాణ, ఒసాకా, అంతర్జాతీయంగా మిగతా భాగ స్వాములతో కలసి అద్భుత భవి ష్యత్తును నిర్మిద్దామని ముఖ్యమం త్రి పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో 30,000 ఎకరాల విస్తీర్ణంలో ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. ఇది ఎకో, ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, స ర్క్యులర్ ఎకానమీ కేంద్రంగా అభి వృద్ధి చెందుతుందని చెప్పారు. ఇం దులో భాగంగా జపాన్‌కు చెందిన మరుబెని కార్పొరేషన్‌తో కలిసి ఒక ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరా బాద్ చుట్టూ 370 కిలోమీటర్ల పొ డవైన రీజనల్ రింగ్ రోడ్ (RRR), రేడియల్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్ (ORR) మధ్య ఉన్న జోన్‌లో ఎలక్ట్రి క్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎల క్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్ పరిశ్రమలకు అనుకూల వాతావర ణం ఉందని తెలిపారు. అంతర్జాతీ య ఎగుమతుల కోసం సమీప ఓ డరేవుతో అనుసంధానించే డ్రై పో ర్ట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేస్తు న్నట్లు వివరించారు.

మూసీ నది పునరుజ్జీవంలో భాగం గా నది పొడవునా 55 కిలోమీటర్ల అర్బన్ గ్రీన్ వే అభివృద్ధికి జపాన్ నగరాలైన టోక్యో, ఒసాకాల శ్రేష్ఠమై న అనుభవాల నుంచి నేర్చుకోవా ల్సిన అవసరం ఉందని ముఖ్య మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడు తూ తెలంగాణ ఇప్పటికే ఐటీ, బ యోటెక్నాలజీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిందని గుర్తుచే స్తూ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌ టైల్స్ రంగాల్లో పెట్టుబడులకు అ నువైన వాతావరణం రాష్ట్రంలో నెలకొన్నదని వివరించారు. పరి శ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి శ్రీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ నైపుణ్యాల శిక్షణతో పాటు నాణ్య త, క్రమశిక్షణకు అద్దం పట్టేలా ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూని వర్శిటీ’ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇది ఉపాధి, వ్యాపార అవకాశాలను రెట్టింపు చేస్తుందన్నారు.