–ఫిబ్రవరి 10 లోగా తెలంగాణ పర్యాటక పాలసీ
–ఉన్నతాధికారుల సమీక్షా సమా వేశంలో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో ఫిబ్రవరి 10 వ తేదీలోగా అత్యుత్తమ పర్యాటక విధానం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదే శించారు. దేశ, విదేశాల్లోని అత్యు త్తమ పాలసీని అధ్యయనం చేసి తెలంగాణ పర్యాటక పాలసీని రూపొందించాలని చెప్పారు. ముఖ్యమంత్రి టూరిజం పాలసీపైన మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరి జం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమే ష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. దేశ, విదే శాల పర్యాటకులను ఆకర్షించేలా పాలసీ ఉండాలి. ప్రధానంగా టెం పుల్, ఎకో టూరిజంపై దృష్టి సారిం చాలి. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ఆస్కారం ఉన్న, అవస రమైన ప్రాంతాలను గుర్తించి అభి వృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలి. సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలి.
సమ్మ క్క-సారలమ్మ జాతర జరిగే సమ యంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు సిద్దం చేయాలి. జాతరతో పాటు సమీప పర్యాటక ప్రాంతాలు, ఆలయాలను కలు పుతూ ఒక సర్క్యూట్ను అభివృద్ధి చేయాలి. ఆదిలాబాద్, వరంగల్, నాగార్జునసాగర్ లాంటి ప్రాంతా లలో ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ఉండాలి. వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశవ్యాప్తంగా భక్తు లు, పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి.
హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఇందిరా పార్క్లను కలుపుతూ టూరిజం సర్క్యూట్ను అభివృద్ధి చేసే అం శాన్ని పరిశీలించాలి. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా ఈ పాలసీని రూపొందించాలన్నారు.