Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : నగరంలో బయోఏషియా సదస్సు

— ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

— పాల్గొననున్న 50 దేశాల 3వేల మంది ప్రతినిధులు

CM Revanth Reddy : ప్రజా దీవెన హైదరాబాద్‌: జీవ విజ్ఞాన రంగం(లైఫ్‌ సైన్సెస్‌)లోని పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలను ఒక వేదికపైకి తీసుకొచ్చే బయో ఏషియా సద స్సుకు సర్వం సన్నద్ధమైంది.22వ బయో ఏషియా సదస్సు ఈ నెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని హెచ్‌ఐ సీసీ వేదికగా జరగనుంది. 50 దేశా లకు చెందిన దాదాపు 3,000 మం ది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననుండగా రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదు గా 25వ తేదీ మంగళవారం సద స్సు ప్రారంభం కానుంది. ‘క్యాటలిస్ట్‌ ఆఫ్‌ చేంజ్‌ ఎక్స్‌పాండింగ్‌ గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ ఫ్రాంటియర్స్‌’ అనే నేప థ్యంతో ఈసారి సదస్సును నిర్వహి స్తున్నారు. ఆరోగ్య సంరక్షణ రం గంలో కృత్రిమ మేధ(ఏఐ)తో వచ్చి న మార్పులు, లైఫ్‌ సైన్సెస్‌ భవిష్య త్తును నిర్దేశించే ఆవిష్కరణలు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బలో పేతం తదితర అంశాలను ప్రభు త్వం సదస్సు అజెండాలో చేర్చింది.

 

ఇక, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శా ఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, క్వీ న్స్‌ల్యాండ్‌ గవర్నర్‌ డాక్టర్‌ జీనెట్‌ యంగ్‌, జీ20 షెర్పా అమితాబ్‌ కాంత్‌, ఇస్రో మాజీ చైర్మన్‌ సోమ నాథ్‌, డాక్డర్‌ రెడ్డిస్‌ లాబ్స్‌ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి, భారత్‌ బయోటెక్‌ ఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ డాక్టర్‌ సత్యనా రాయణ చావా తదితర ప్రముఖు లు సదస్సులో ప్రసంగిస్తారు. కాగా, హైదరాబాద్‌లో జరగబోయే బయో ఏషియా సదస్సు చరిత్రలోనే ప్రభా వవంతమైన సదస్సుగా నిలుస్తుంద ని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కొత్త స్టార్టప్‌ కంపెనీల నుంచి బయో ఏషియా సదస్సుకు అంచనాలకు మించిన స్పందన వచ్చిందని పరిశ్ర మల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. బ యో ఏషియా సదస్సుకు 700స్టా ర్టప్‌ కంపెనీలు దరఖాస్తు చేసుకోగా 80సంస్థలు తమ ఆవిష్కరణలను పరిచయం చేస్తాయని బయోఏషి యా సీఈవో, తెలంగాణ లైఫ్‌ సైన్సె స్‌ డైరెక్టర్‌ శక్తినాగప్పన్‌ తెలిపారు.