CM revanth reddy, Chandrababu : సమన్వయంతో సమస్యలకు పరిష్కారం
--అపరిష్కృత అంశాలను త్వరగా మార్గం వెతకాలని నిర్ణయించాం --మూడు దశల్లో కమిటీల ఏర్పా టుకు నిర్ణయo తీసుకున్నాం --ఉన్నతాధికారులతో కూడిన ఇరు రాష్ట్రాల నుంచి త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేస్తాం --మీడియాతో రెండు రాష్ట్రాల ము ఖ్యమంత్రుల సమావేశo వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సమన్వయంతో సమస్యలకు పరిష్కారం
–అపరిష్కృత అంశాలను త్వరగా మార్గం వెతకాలని నిర్ణయించాం
–మూడు దశల్లో కమిటీల ఏర్పా టుకు నిర్ణయo తీసుకున్నాం
–ఉన్నతాధికారులతో కూడిన ఇరు రాష్ట్రాల నుంచి త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేస్తాం
–మీడియాతో రెండు రాష్ట్రాల ము ఖ్యమంత్రుల సమావేశo వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రజా దీవెన, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ( ap re or ganisation) ద్వారా గత పది సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని అంశాలను త్వరగా చర్చించుకుని ముందుకు పోవాలని నిర్ణయించామని తెలంగాణ డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క( dy CM vikramaarka) తెలిపారు.విభజన చట్టంలోని సమస్య లన్నిటికీ మొదటి సమావేశంలోనే పరిష్కారం దొరుకు తుందని మే ము భావించలేదని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ( both Telugu States) ముఖ్య మంత్రుల సమావేశం అనంతరం సదరు వివరాలు మీడియా సమా వేశంలో బట్టి విక్రమార్క వెల్లడించారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల సహచర మంత్రులతో కలిసి ఆయన స మావేశం వివరాలు క్లుప్తంగా తెలియపరిచారు.సమస్యల పరి ష్కా రానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, రెండు రాష్ట్రా ల ప్రతినిధులు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి మూడు దశల్లో కమిటీలు ( thr ee committees) ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
రెండు రాష్ట్రాలకు సంబంధించి చీఫ్ సెక్రటరీ స్థాయి ఉన్నతాధికారు లతో కూడిన ఇరు రాష్ట్రాల నుంచి త్రీమెన్ క మిటీని ఏర్పాటు చేయ నున్నామని ప్రకటించారు. రెండు వారాల్లో ఉన్నత స్థాయి అధి కారు ల కమిటీ సమావేశమై వారి స్థాయిలో పరిష్కార మార్గాలు చూస్తా రని అన్నారు. ఉన్నత స్థాయి అధికారులు పరిష్కారం చూప లేని అంశాలను ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ ( ministets comm itiee) కమికసరత్తు చేస్తుందని, తద్వారా పరిష్కార మార్గాలు కను గొంటారని స్పష్టం చేశారు.
మంత్రుల స్థాయిలో పరి ష్కారం కనుగొన్న సమస్యలకు ముఖ్యమం త్రులు ఆమోదం తెలుపుతారని, ఇరు రాష్ట్రాల మంత్రుల స్థాయిలో పరిష్కారం కాని సమ స్యలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరి ష్కార మార్గాలు కనుగొనాలని ప్రాథమికంగా నిర్ణయించామని ( Bas ically decided) తెలి పారు.వీటితోపాటు రెండు తెలుగు రాష్ట్రా లు ప్రజలు ఇబ్బంది పడు తున్న సమస్యల పై కలిసి పని చేయాలని నిర్ణయించామని చెప్పారు.
అదేవిధంగా యాంటీ నార్కోటిక్ (Anti narcotic) అంశంపై తె లంగాణ రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా భావించి అడిషనల్ డీజీ స్థాయి అధికారితో ప్రత్యేక డ్రైవ్ నిర్వ హిస్తుందని చెప్పారు. సైబర్ క్రైమ్ సంబంధించి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ రెండు అంశాల్లో రెండు రాష్ట్రాలు సమన్వయంతో (co ordina tion) పని చేయాలని వీటిని నియంత్రించాలని నిర్ణయించామన్నా రు.
ఈ మహమ్మా రుల నుంచి రెండు రాష్ట్రాల ప్రజలను కాపా డుకు నేందుకు అడిషనల్ డీజీ స్థాయిలో రెండు రాష్ట్రాల్లో కమిటీ ఏర్పాటు చేసుకొని సమన్వ యంతో పని చేసుకుని వీటిని నియంత్రించాలని నిర్ణయించామని వెల్లడించారు. ఇదిలా ఉండగా పలువురు జర్నలి స్టులు అడిగిన ప్రశ్నలకు అన్నింటికీ కమిటీ వేస్తున్నామని తద్వారా పరిష్కార మార్గాలు కనుక్కుంటామని సమాధానం ఇచ్చారు.
CM revanth reddy, Chandrababu