CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రాబాద్ మెట్రోను ఫ్యూచర్ సిటీ వ రకు విస్తరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ విస్తరణకు అవసరమైన తుది ప్రతి పాదనలు సిద్ధం చేయాలని అధికా రులను ఆదేశించారు. నగరంలో మెట్రో విస్తరణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
మెట్రో రెండో దశ విస్తరణకు సంబం ధించిన ప్రతిపాదనల పురోగతిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆ రా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇ ప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు అధికా రులు వివరించారు.
నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు (36.8 కి.మీ.), రాయ దుర్గం – కోకాపేట నియోపోలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్ – చాం ద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియా పూర్ – పటాన్చెరు (13.4 కి.మీ.), ఎల్బీ నగర్ – హయత్నగర్ (7.1 కి.మీ.) మొత్తం కలిపి 76.4 కి.మీ. ల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రా నికి పంపించింది.
కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చెరిసగం నిధులు భరించేలా జా యింట్ వెంచర్గా ఈ ప్రాజెక్టు చేప ట్టేలా ప్రతిపాదనలు తయారు చే సింది. కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయ త్నించాలని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్న ద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ లోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) వరకు 40 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరిం చేందుకు కొత్తగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశిం చారు. దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రో ను మీర్ఖాన్పేట్ వరకు పొడిగించా లని చెప్పారు.
అందుకు అవసరమయ్యే అంచ నాలతో డీపీఆర్ తయారు చేసి కేం ద్రానికి పంపించాలని సూచించా రు. హెచ్ఎండీఏ (HMDA)తో పా టు ఫ్యూచర్ సిటీ డెవెలప్మెంట్ అథారిటీ (FCDA) ని ఈ రూట్ మెట్రో విస్తరణలో భాగస్వామ్యుల ను చేయాలని చెప్పారు.
ముఖ్యమంత్రితో పాటు సలహా దారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీని వాసరాజు, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సంబంధిత ఉన్నతాధికారులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.