Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy dharani : ‘ధ‌ర‌ణి’ కి శాశ్వ‌త ప‌రిష్కారం

--ప్ర‌జ‌ల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌ల విధిగా స్వీకరించండి  --విస్తృత సంప్ర‌దింపులు, అఖిల‌ప‌క్ష భేటీ త‌ర్వాతే నూత‌న చ‌ట్టం --స‌మ‌స్య‌ల అధ్య‌య‌నానికి పైలెట్ ప్రాజెక్టుగా ఓ మండ‌లం ఎంపిక‌ -- సమీక్షా సమావేశం లో ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి

‘ధ‌ర‌ణి’ కి శాశ్వ‌త ప‌రిష్కారం

–ప్ర‌జ‌ల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌ల విధిగా స్వీకరించండి 
–విస్తృత సంప్ర‌దింపులు, అఖిల‌ప‌క్ష భేటీ త‌ర్వాతే నూత‌న చ‌ట్టం
–స‌మ‌స్య‌ల అధ్య‌య‌నానికి పైలెట్ ప్రాజెక్టుగా ఓ మండ‌లం ఎంపిక‌
— సమీక్షా సమావేశం లో ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి

ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: ధ‌ర‌ణితో ( dharani) తలెత్తుతున్న స‌మ‌ స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారానికి మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ( CM revanth reddy) అభిప్రాయ‌ప‌డ్డారు. భూ స‌మ‌స్య‌లు నానాటికీ ఎక్కువ‌వుతుండ‌డం తో స‌మ్ర‌గచ‌ట్టం రూపొందించాల్సి ఉంద‌న్నారు. రాష్ట్రస‌చివాల‌యం లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న శుక్ర‌వారo సాయంత్రం ధ‌ ర‌ణి స‌మ‌స్య‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.

ఒక‌ప్పుడు గ్రామ స్థాయిలోనే అందుబాటులో ఉండే రికార్డులు ( rec ords ) చ‌ట్టా ల మార్పుతో క్ర‌మంగా మండ‌ల కేంద్రానికి, త‌ర్వాత జిల్లా కేంద్రానికి, రాష్ట్ర స్థాయికి వెళ్లి పోయాయ‌న్నారు. గ‌తంలో భూ స‌మ‌స్య‌ల ( land litications)  అప్పీలు చేసుకునే అవ‌కాశం ఉండేద‌ని గుర్తుచేశారు. ధ‌ర‌ణితో గ్రామ‌, మండ‌ల స్థాయిలో ఏ స‌మ‌ స్యకు ప‌రిష్కారం లేకుండాపోయింద‌ని, స‌మ‌స్త అధికారులు జిల్లా క‌లెక్ట‌ర్‌కు అప్ప‌జెప్పార‌న్నారు.

అక్క‌డ కూడా స‌మ‌స్య పరిష్కారం కావ‌డం లేద‌ని, క‌లెక్ట‌ర్లు ( colle ctors ) తీసుకు నే ఏ నిర్ణ‌యాన్ని ప్ర‌శ్నిం చే అవ‌కాశం లేకుండా ధ‌ర‌ ణిని రూపొందించార‌న్నారు. ఈ నేప‌థ్యంలో భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కా రానికి విస్తృత‌ స్థాయి సంప్ర‌దింపులు చేప‌ట్టాల‌ని, ప్ర‌జ‌ల నుంచి స‌ల‌ హాలు, సూచ‌న‌లు స్వీక‌రించాల‌ని ముఖ్య‌మంత్రి( CM ) అన్నారు. అలాగే అఖిల‌ప‌క్ష భేటీ ఏర్పాటు చేసి అం ద‌రి అభిప్రాయాల‌తో స‌మ‌గ్ర చ‌ ట్టం తీసుకురావాల్సి ఉంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నా రు.

భూదాన్‌, పోరంబోకు, బంచ‌రాయి, ఇనాం, కాందిశీకుల భూముల స‌మ‌ స్య‌లున్న ఓ మండ‌లాన్ని ఎంపిక చేసుకొని, అక్క‌డ ఎదుర‌వు తున్న స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేసి స‌మ‌గ్ర నివేదిక (Compre hensive report)  రూపొందిస్తే ఆ స‌మ‌స్య‌ల‌పైనా పూర్తి స్ప‌ష్ట‌త ఏర్ప‌డుతుంద‌న్నారు. అవ‌స‌ర‌మైతే వీట‌న్నింటిపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ చేసి తుది నిర్ణ‌యం తీసుకుంటా మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

స‌మావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, పం చాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌ భాక‌ర్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేశ‌వ‌రావు, ముఖ్య‌మంత్రి స‌ల‌ హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, ధ‌ర‌ణి క‌మిటీ స‌భ్యులు కోదండ‌రెడ్డి, సునీల్ కుమార్‌, రేమండ్ పీట‌ర్‌, మ‌ధు సూద‌ న్‌, సీసీఎల్ఏ న‌వీన్ మిట్ట‌ల్‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కు మారి, ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్య‌ద‌ర్శులు వేముల శ్రీ‌నివాసులు, సంగీత స‌త్యానారాయ‌ణ‌, అజిత్ రెడ్డి పాల్గొన్నారు.

CM Revanth Reddy dharani