–రెండో విడత రుణ మాఫీ నిధుల విడుదల సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి
–రుణమాఫీతో మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం
–రెండో విడతగా రూ. 12224.98 కోట్ల రుణాలు మాఫీ చేసినం
–కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని రుజువు చేశాం –ఆగస్టులో రూ. 2లక్షల లోపు రుణాలన్నీ మాఫీ ఖాయం
–గత ప్రభుత్వం చేసిన మిత్తి కింద ఇప్పటిదాకా రూ. 43 వేల కోట్లు కట్టినం
— రుణమాఫీ పై శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకా రం రైతు రుణమాఫీ రెండో విడత నిధులు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం రూ. 6,191 కోట్ల నిధులు విడుదల చేశారు. రెండో విడతలో భాగంగా అసెంబ్లీలో సీఎం (cm) ప్రారంభించారు. వేదికపై 17 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం పండుగని నిరూపి స్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఎన్నికలు లేవ ని, వ్యవసాయం పండుగ తమకు రాజకీయ ప్రయోజనాలు (Political benefits) ముఖ్యo కాదని, రైతుల ప్రయోజనాలే మా విధాన మని సీఎం చెప్పారు. నెహ్రూ నుంచి శాస్త్రి వరకు ఆహార, దేశ భద్రతలకు అత్యంత ప్రా ధా న్యం ఇచ్చారని చెప్పారు. అక్కడి నుంచే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం వచ్చిం దని గుర్తు చేశారు. ఈ దేశంలో మోదీ ప్రభు త్వం కార్పొరేట్ సంస్థలు 14 లక్షల కోట్ల రూపాయల బ్యాంకులకు ఎగవేశా యని గుర్తు చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులు ఆ పనిచేయరని అన్నారు. అప్పుల పాలైనా వ్యవసాయం వదలరని చెప్పారు. తెచ్చిన అప్పులు కట్టలేకపోతే తన పొలం దగ్గరికి పోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటారని అన్నారు. వాళ్లకు అండగా నిలబడి ధైర్యం చెప్పడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు.
రైతులు (farmers) ఆనందంగా ఉండాలని, సంక్షోభంలో కూ రుకుపోవద్దని ఆ నాడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రైతు డిక్లరేషన్ ప్రకటించామ ని, దానిని తూచా తప్పకుండా అమలుచేస్తు న్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనమవు తుందని అన్నారు. గత ప్రభుత్వం పదేండ్లు పాలించి రూ. లక్ష రుణమాఫీ చేయలేకపోయిందని అన్నారు. తమకు చిత్తశుద్ధి ఉన్నందునే సంకల్పాన్ని నెరవేర్చామని చెప్పారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ రాష్ట్రంలో రుణమాఫీ సాధ్యం (Loan waiver possible) కాదని చాలా మంది శాపనార్థాలు పెట్టారని గుర్తు చేశారు. మాటా తప్పుతామ ని చాలా మంది అన్నారని కానీ ఇదీ మా చి త్తశుద్ధి అని నిరూపించామని చెప్పారు. జులై 18 నాడు మొదటి విడతలో లక్షలోపు రుణా లున్న వారి లోన్లు మాఫీ చేశామని, ఇవాళ లక్షన్నర లోపు బాకీ ఉన్న రైతుల రుణాలను మాఫీ చేశామని చెప్పారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన కేసీఆర్ (kcr) గత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రా న్ని తాకట్టు పెట్టారని, ఆయన చేసిన అప్పులకు వడ్డీ కింద ఇప్పటి వరకు 43 వేల కోట్ల వడ్డీ కట్టామని సీఎం చెప్పారు. దీంతో ప్రతి నెలా మొదటి తారీఖున జీతాలు, పించ న్లు ఇస్తు న్నామని అన్నారు. వీటితో పాటు రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నామని, ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు అనుమతి ఇవ్వడంతోపాటు అంగన్ వాడీల నుంచి ఆశవర్కర్ల వరకు జీతాలు సకాలంలో చె ల్లిస్తున్నామని చెప్పారు. అప్పుల రాష్ట్రంలో ఇవన్నీ ఇస్తూనే 12,500 కోట్ల రూపాయల రుణమాఫీకి సర్దిన ఆర్థిక మంత్రి భట్టి విక్ర మార్కను, అధికారులను తాను మనస్ఫూ ర్తిగా అభినందిస్తున్నట్టు చెప్పారు. ఆగస్టు నెల చరిత్రలో లిఖించదగినదని, ఆ నెలలో రైతుల రుణాలు పూర్తిగా తీరిపోతాయని చెప్పారు. 77 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో ఏ రాష్ట్రం కూడా 31 వేల కోట్ల రుణాలను మాఫీ చేయలేదని, తాము మాత్రమే చే స్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన మంత్రివర్గ సహ చరులు, అధికారులకు సీఎం (cm) పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులున్నా రైతుబంధు: తుమ్మల
ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతుబం ధు ఇచ్చి తీరుతామని వ్యవసా యశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన రెండో విడుత రుణమాఫీ కార్యక్ర మంలో ఆయన మాట్లాడుతూ గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్ప దని, ఆ మేరకు మంగళవారం 2 లక్షల లోపు రైతుల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తోందని చెప్పారు. ఇప్పుడు 1 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర రైతుల తరపున ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు తుమ్మల చెప్పా రు. త్వ రలోనే పంట బీమాను కూడా ప్రారంభిస్తామని అన్నారు. రైతు భరోసా విషయంలో అన్ని జిల్లాల రైతుల నుంచి అభిప్రాయా లు తీసుకుంటున్నామని అన్నారు. తాము గత ప్రభుత్వం లాగా రైతు బంధు ఇవ్వబోమని అన్నారు. రైతుల అభిప్రాయాల మేరకే ఈ ప్రభుత్వం నడుచుకుంటుందని చెప్పారు.
త్వరలో పంటల బీమా: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్రంలోని రైతుల పంటలను ప్రభుత్వం బీమా చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వరంగల్ డిక్లరేషన్ కు వెళ్లే ముందు రూ.2 లక్షల రుణమాఫీ సాధ్యమా అనే చర్చవచ్చింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ సాధ్యమే మనం చేయాల్సిం దే అని చెప్పారు. టీఆర్ఎస్ సర్కా రు. లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు దఫాలుగా చేసింది. వడ్డీ లు పెరిగి రైతులు ఇబ్బంది పడిన పరిస్థితిని చూశామనే చర్చ వచ్చిం ది.. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇది సాధ్యమా.. అనే సందేహాలూ వచ్చాయి. మనకు సంకల్పం ఉంది.. చేద్దాం అన్నారని చెప్పారు. అలాంటి సంకల్పాన్ని నిజం చేస్తున్నామన్నారు. ఆగస్టు లోపు 2 లక్షల రూణాన్ని మాఫీ చేస్తున్నా మని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభు త్వం గాలికి వదిలేసిన 1,350 కోట్లతో పంటల బీమాను రాష్ట్ర ప్రభుత్వం చేయబోతోందన్నారు. బ్యాంకుల్లో ఉన్న రుణమంతా ఒక్కటే సారి మాఫీ అవుతుంటే రైతులు సంతోషంగా పండుగా చేసుకునే రోజని భట్టి తెలిపారు.