CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తాటి, ఈత చెట్ల నుండి వచ్చే కల్లుతో వైన్, ఆ రక్ తదితర అనుబంధ పదార్థాలు తయారు చేసే పరిశ్రమను ఏర్పా టు చేయడానికి తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుతూ జర్మన్ ప్రతి నిధి స్టీఫెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్కలను కలిశారు.గతంలో మం త్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఫ్రొఫెసర్ జానయ్య కాంబోడియా స్టడీ టూర్ వెళ్ళినపుడు అక్కడ ఈ పరిశ్రమ ఎంతో ఆర్థికంగా ఉపాధి కల్పిస్తుం డడంతో తెలంగాణ లో కూడా పరి శ్రమ ఏర్పాటు కు స్టీఫెన్ సహకరిం చాలని విజ్ఞప్తి చేశారు. వీరి విజ్ఞప్తి మేరకు తెలంగాణ లో కల్లు ఆధారి త పరిశ్రమల్లో భాగంగా తాటి ఈత చెట్ల నుండి వైన్ , ఆరక్ తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు చేస్తామని జర్మన్ ప్రతినిధి స్టీఫెన్ ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి కి తెలియజేశారు.
గురువారం అసెంబ్లీ ప్రాంగణములో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లతో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన స్టీఫెన్ ఈ పరిశ్రమ తెలంగాణాలో ఏర్పాటు చేయడం వల్ల గీత కార్మికులు వృత్తి పరమైన ఆర్థికాభివృద్ధిని పొందడ మే కాకుండా, వాల్యూ అడిషన్, ఉపాధి అవకాశాలు మెరుగుపడ తాయని అయన వివరించారు. తె లంగాణ కల్లు యూరప్ కి ఎగుమ తి స్థానికంగా కల్లు దుకాణాల ఏ ర్పాటు గీత కార్మికులకు కనీసం ఆ దాయం పెంపుదల ఇతర రాష్ట్రా లు, ఇతర దేశాలకు మార్కెటింగ్ విస్తరణ తో పాటు రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ విభాగం ఏర్పాటు చే యడం, తాటి ఈత మొక్కలు త్వ రగా పెరిగి అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాల తయారుకు తాము సి ద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి వి వరించారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ చీఫ్ మ హేష్ కుమార్ గౌడ్, జర్మన్ ప్రతినిధి స్టీఫెన్,పారిశ్రామిక వేత్త రోహిత్ పా ల్గొన్నారు.