CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కా ర్యక్రమాలు, అనుసరిస్తున్న విధా నాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. సామాజిక న్యాయంతో పాటు ఇతర అంశాల్లో తెలంగాణ మాడల్ను కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాల్సిన పరిస్థితి ఉందన్నారు. బెంగుళూరు వేదికగా ది హిందూ పత్రిక నిర్వహించిన The Hindu Huddle 2025 కార్యక్రమంలో శ్రీ రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని పలు ప్రశ్నలకు విడమరిచి సమాధానాలిచ్చారు.
పెట్టుబడుల కోసం ప్రపంచ దేశాలు చైనా ప్లస్ వన్ ప్రత్యామ్నాయ మ ర్గాలను అన్వేషిస్తున్న తరుణంలో దానిని అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమ లుతో పాటు అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని వాటిని సమగ్రంగా తెలియజేశారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రభుత్వం విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పనా రంగాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా అనేక వినూత్న ప్రణాళికలకు శ్రీకారం చుట్టాం. ప్రపంచ దేశాల్లోని అగ్రగామి నగరాలతో పోటీ పడాలన్నదే మా ఆలోచన. అందులో భాగంగానే నెట్ జీరో సిటీకి ప్రణాళికలు సిద్దం చేశాం. దేశంలోనే మొట్టమొదటిదిగా ఫ్యూచర్ సిటీకి రూపకల్పన చేశాం. ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను రద్దు చేశాం. 360 కి.మీ మేరకు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించడమే కాకుండా తెలంగాణలో ప్రాంతాల వారిగా పారిశ్రా మికీకరణకు సన్నద్ధమయ్యాం.
రీజినల్ రింగ్ రోడ్డు లోపలి పరిధి లో పరిశ్రామిక పార్కులు, ఐటీ, ఎలక్ట్రిక్ వాహనాలు, అటోమొబైల్ ఇండస్ట్రీ, ఇతర పరిశ్రమలను ఆకర్షించే విధంగా మౌలిక సదుపా యా ల కల్పించాలన్నదే ప్రయత్నం. డ్రై పోర్టు నిర్మాణం వంటి అనేక ప్రణా ళికలకు రూపకల్పన చేశాం. రా ష్ట్రానికి 2 లక్షల కోట్లకు పైగా పెట్టు బడులను సాధించాం. ఇవన్నీ రా ష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చుతాయి. మా ప్రభుత్వం సహేతు కమైన ప్రణాళికలతో పెట్టుబడుల ను ఆకర్షించేందుకు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ఇతర రంగాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తుంది.
ప్రతి అంశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాలన్నదే ప్రయత్నం. ఇటీవల జపాన్ దేశ పర్యటన సం దర్భంగా తెలుసుకున్న విషయాల మేరకు ఆ దేశానికి అవసరమైన మానవ వనరులను సమకూర్చడా నికి వీలుగా తెలంగాణలో జపనీస్ భాషను నేర్పించాలని సంకల్పించాం.
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సా మాజిక, ఆర్థిక, విద్య ఉద్యోగ, రాజ కీయ సర్వే దేశానికి ఒక మోడల్గా నిలిచింది. ఈ సర్వే సమాజాన్ని మ రింత సమర్థవంతంగా గుర్తించి సేవ లు అందించడంలో దోహదపడు తుంది. ఇది కేవలం బీసీల కోసమే కాదు. ఈ సర్వే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ ప్రజలకూ ఉపయోగపడుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ ముందడుగు వేసింది.
కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ మాడల్ను అమలు చేయాలి. ఈ రకంగా అనేక కోణాల్లో తెలంగాణ రైజింగ్ మొదలైంది. తెలంగాణలోని వేర్వేరు రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఐసొలేషన్ గా సాగుతున్న విద్యను ఇంటిగ్రేట్ చేయడం ద్వారా పిల్లల్లో సోషలైజేషన్ ప్రక్రియకు చేపట్టాం. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం.
జనాభాలో దాదాపు 60 శాతము న్న వ్యవసాయ కుటుంబాలకు అం డగా ఉండేందుకు అధికారం చేప ట్టిన తొలి ఏడాదిలోనే రాష్ట్రంలో 25 లక్షలకు పైగా రైతులకు 21, 61 7 కోట్ల రూపాయల మేరకు రుణ మాఫీ చేశాం. రైతులకు ఏటా 12 వేలు ఇన్ పుట్ సబ్సిడీగా ఇస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే రాష్ట్రం కనీస మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు రూ. 500 బోనస్ చెల్లి స్తున్నాం.
అలాగే 67 లక్షల సభ్యులున్న స్వ యం సహాయక సంఘాల మహిళ లకు వెయ్యి మెగావాట్ల సోలార్ ఉ త్పత్తిని అవకాశం, పాఠశాలల నిర్వహణ, యూనిఫామ్ వంటి బా ధ్యతలన్నీ వారికే అప్పగించాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం.
అధికారం చేపట్టిన తొలి ఏడాది లోనే 59 వేలకు పైగా ప్రభుత్వ ఉ ద్యోగాలు ఇచ్చాం. నిరుద్యోగ యు వతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక నిర్ణయాలు తీసుకున్నాం. స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, టాటా టెక్నాలజీస్ సహకారంతో రాష్ట్రంలోని 105 ఐటీఐలను ఏటీసీలుగా మార్చుతు న్నాం. ఇవన్నీ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి మార్గాలను చూపించడంలో భాగంగా చేపట్టాం.
డీలిమిటేషన్కు మేము వ్యతిరేకం కాదు. కానీ ముందు కేంద్ర ప్రభు త్వం ఆ ప్రక్రియకు సంబంధించి అ న్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి అందుకు ప్రాతిపదికను స్పష్టంగా వెల్లడించాలి. అన్ని రాష్ట్రాలకు స మన్యాయం కావాలన్నదే మా డి మాండ్. అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలను శిక్షించకూడదు. ఇది సా మాజిక, రాజకీయ న్యాయానికి సం బంధించిన అంశం. అందుకే చర్చ జరగాలని అడుగుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో తొలుత ముఖ్య మంత్రి మాట్లాడుతూ “మొదటగా నేను భారతీయ సైన్యానికి సెల్యూట్ చేస్తున్నాను. దేశాన్ని రక్షించడం లో అహర్నిశలు కృషి చేస్తున్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం కాపలా కాస్తోంది. ఈ సమయంలో అంద రం సైనికులకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.