–అధికారపక్షం, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం
–ప్రస్తుతం చట్టసభల స్ఫూర్తిని కోల్పోతున్నం
–దేశాభివృద్ధి కోసం మోదీతో కలిసి పనిచేస్త
–త్వరలో యంగ్ ఇండియాస్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ
— ఉనికి పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: అధికా రపక్షం, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వ మని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నా రు. తనకు ఎలాంటి భేషజాలు లేవ ని, ఎవరి సలహాల నైనా స్వీకరిస్తా నని తెలిపారు.ప్రస్తుతం చట్ట సభల స్ఫూర్తిని కోల్పోతున్నామని విప క్షాలు విమర్శలు చేయడానికి, సల హాలు ఇవ్వడాని కి అవకాశం ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రతి పక్షానికి విలువ ఇస్తోందని. ఇప్ప టివరకు అసెంబ్లీలో ఒక్క సభ్యు డిని కూడా సస్పెండ్చేయలే దని గుర్తుచేశారు. గతంలో విశ్వవిద్యా లయాల నుంచే రాజకీయ నేతలు వచ్చారని తెలిపారు. మాజీ గవర్న ర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైద రాబాద్ తాజ్ కృష్ణలో నిర్వహిం చిన కార్యక్రమానికి కేంద్రమంత్రి బండి సంజయ్, గవర్నర్లు బండారు దత్తాత్రేయ. హరిబాబు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ లక్ష్మ ణ్ తదితరులు హాజరయ్యారు. ఈసం దర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ ‘అసెంబ్లీలో అధికార పక్షమే కాదు ప్రతిపక్షం కూడా ము ఖ్యమే. తెలంగాణ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కృషి చేస్తున్నం. దేశాభి వృద్ధి కోసం మోదీతో కలిసి పనిచేస్త. పెండింగ్ జెక్టులకు అనుమతి ఇవ్వాలని ప్రధానిని కోరాను. కాజీపేట రైల్వే డివిజన్, మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్ కోసం సంజయ్ కేంద్రం తో మాట్లాడాలి. స్కిల్ వర్సిటీ ద్వారా యువతలో నైపుణ్యాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నం. తెలంగాణ నుంచి ఒలిం పిక్స్ లో పతకం సా ధించడానికి కృషి చేస్తున్న. త్వరలో యంగ్ఇండియా స్పోర్ట్స్ యూనివ ర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తం. రాష్ట్ర ప్రయోజనాల విష యంలో కొన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీ లు కలిసిపో రాడుతున్నాయని తెలిపారు.
విద్యాసాగర్ రావు ఆదర్శనీ యమైన నేత… సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నా ఒక్క మర కలేదు. ఇంతవరకు వ్యక్తిగతంగా ఎవరూ ఆరోపణలు చేయలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నారు. గోదావరి జలాల కోసం విద్యాసాగర్ రావు ఉద్యమించారు. కానీ ఆయన కల ఇప్పటికీ నెరవేర లేదు. తుమ్మిడిహెట్టి భూసేకరణకు విద్యాసాగర్ రావు సహాయం తీసు కుంటం. గోదావరి జలాలను సద్వి నియోగం చేసుకుంటమని సీఎం రేవంత్ తెలిపారు.
హైడ్రా మంచిదే, శభాష్ రేవంత్
— మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు
ప్రజా దీవెన, హైదరాబాద్: తాను గవర్నర్ గా ఉన్నప్పుడు ఐదుగురు ముఖ్య మంత్రులు తన కోసం వే యిట్ చేశారని కానీ సీఎం రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకోవడం తన బా ధ్యత అని మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు అన్నారు. ‘సాంస్కృ తిక జాతీయ వాదం అందరిలో ఉంది, పార్టీలు వేరు కావొచ్చు. ఎల్లంపల్లికి శ్రీపాద రావు పేరు పెట్టాలని డిమాండ్ చేసిందే బీజేపీ. వాజ్ పేయిని ప్రధాన మంత్రి అవు తావని నెహ్రూ అన్నారు. పాలక పక్షానికి, ప్రతిపక్షానికి పెద్దగా డిఫ రెన్స్ లేదు, అంబేద్కర్ ఎన్ని అవ మానాలు ఎదుర్కొన్న భారత జాతి ని పదిలిపెట్టలేదు. హైడ్రాను అం దరూ పొగు డుతున్నారు. హైదరా బాద్ నగరాన్ని సుందరంగా నిర్మిం చుకోవాలని ముందుకు వెళ్లడం మంచిది. మూసీ నదిని ప్రక్షాళన చేయాలి’ అని సూచించారు.