Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పను లను ముమ్మరం చేయాలి

— సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్య మం త్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. బా పూఘాట్లో నిర్మించ తలపెట్టిన గాం ధీ సరోవర్ తో పాటు మీర్ అలం ట్యాంక్ పై నిర్మించనున్న బ్రిడ్జి న మూనాలను సీఎం పరిశీలించారు.

మీర్ అలం ట్యాంక్పై బ్రిడ్జి ని ర్మాణ పనులకు జూన్లో టెండర్లు పిలవాల ని ముఖ్యమంత్రి అన్నారు. ఈలో గా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్ల తో డీపీఆర్ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంట ర్ లో మూసీ పునరుజ్జీవనం పై ము ఖ్యమంత్రి అధికారులతో సమీక్ష ని ర్వహించారు. ప్రభుత్వ సలహాదా రులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాస రాజు, మున్సిపల్ శాఖ ముఖ్య కా ర్యదర్శి దానకిషోర్తో పాటు మూసీ రివర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌత మి, ఉన్నతాధికారులు ఈ సమావే శంలో పాల్గొన్నారు.

మీర్ అలం ట్యాంక్ పై నిర్మించే బ్రిడ్జి కి సంబంధించి కన్సెల్టెన్సీలు తయా రు చేసిన నమూనా డిజైన్లను అధి కారులు పవర్ పాయింట్ ప్రజంటే షన్ ద్వారా ప్రదర్శించారు. రెండు న్నర కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి ని అద్భుతంగా నిర్మించాలని, అదే సమయంలో సందర్శకులు, ప్రయా ణికుల రక్షణకు అత్యంత ప్రాధాన్య ముండే డిజైన్లను ఎంచుకోవాలని సీఎం అధికారులను అప్రమత్తం చే శారు. ఈ బ్రిడ్జితో పాటు మీర్ ఆ లం ట్యాంక్లో వివిధ చోట్ల ఐలాండ్లా ఉన్న మూడు ప్రాంతాలను పర్యాట కులను ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.

సింగపూర్ లోని గార్డెన్స్ బై ది బే ను తలపించేలా బర్డ్స్ పారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఈ మూడు ఐలాండ్లను అత్యంత సుందరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వెడ్డింగ్ డెస్టినేషన్ కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వంచర్ పార్క్, ధీమ్ పార్క్, అంఫీ థియేటర్ను ఏర్పాటు చేసేందుకు వీలుగా డిజైన్లు ఉండాలన్నారు. బోటింగ్ తో పాటు పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉండాలని సూచించారు. ట్యాంక్‌ లో నీటిని శుద్ధి చేయటంతో పాటు ఐలాండ్ ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేయాలని చెప్పారు. పీపీపీ మోడల్లో ఈ ఐలాండ్ జోన్ను అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

మీర్ అలం ట్యాంక్లో నీటి లభ్యత ను, వరద వచ్చినప్పుడు ఉండే నీటి ప్రవాహ తీవ్రతను ముందు గానే అంచనా వేసుకొని, భవిష్య త్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు చూపుతో డిజైన్లు చేసుకో వాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రా జెక్టుకు అవసరమైన హైడ్రాలజీ తో పాటు పర్యావరణానికి సంబంధిం చి నిపుణులు, లేదా ఆ రంగంలో పేరొందిన సంస్థలతో సర్వే చేయిం చాలని, ఆ నివేదికల ఆధారంగా అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూ చించారు.

మీర్ అలం బ్రిడ్జితో పాటు ఈ ఐలాండ్ జోన్ను పక్కనే ఉన్న జూ పార్కుకు అనుసంధానం చేయాల ని సూచించారు. ఇక్కడి డెవెల ప్మెంట్ ప్లాన్ను దృష్టిలో పెట్టుకొని జూ పార్కును అప్ గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జూ అధికారులతో సంప్రదింపులు జరి పి, నిబంధనల ప్రకారం అప్ గ్రేడ్ చేసేందుకు ఉన్న అన్ని అవకాశాల ను పరిశీలించాలని సూచించారు. పర్యాటకులను మరింత ఆకట్టుకు నేలా అభివృద్ధి ప్రతిపాదనలు త యారు చేయాలని చెప్పారు.