CM.Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ ల్ స్కూల్స్ కు సంబంధించి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి విద్యా శాఖ ఉన్న తాధికారులను ఆదేశించారు.
విద్యా శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ స్కూళ్లకు అవసరమైన స్థలాల సేక రణ, ఇతర పనుల పురోగతిని ము ఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
నియోజకవర్గాల్లో ఎక్కడైతే స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన చో ట అనుమతులు, ఇతర పనులను వేగంగా చేయాలని ఆదేశించారు. ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉ న్నాయో లేదో ముందుగా పరిశీలిం చాలని సూచించారు. అనువైన స్థలం లేని చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలని చెప్పారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి త్వరగా స్థలాలను గు ర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని, దీనిపై వారం రోజుల్లో నివేదిక అం దించాలని ఆదేశించారు. ఇప్పటికే స్థల సేకరణ జరిగిన నియోజకవర్గా ల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టాలి. రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌ లిక సదుపాయాలతో వంద శాతం పనులు పూర్తికావాలన్నారు. వీర నారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయ అభివృద్ధికి అవసరమై న నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ విశ్వవిద్యాలయంలో భవిష్యత్తు అ వసరాలకు తగినట్టుగా పూర్తి స్థా యి ప్రమాణాలతో సరైన మౌలిక వ సతులు కల్పించాలని ముఖ్యమం త్రి ఆదేశించారు.