— సీఎం టీమ్ లో స్థానం కోసం నేతల ఒత్తిడి
CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆగస్టు 2వ తేదీ నుంచి 14వరకు అమెరికా పర్యటనకు వెళ్ల నుండగా, సీఎం (CM Revanth Reddy) అమెరికా పర్యటన బృందంలో (American tour group) చోటుకు కోసం పలు వురు ప్రజాప్రతినిధులు, అధికా రులు ల్యాబియింగ్ తో ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెంట పెద్ద బృందం అమెరికాకు వెళ్లను న్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా మంత్రివర్గంలో చోటు కోసం లాబీ యింగ్ చేస్తున్న ఎమ్మెల్యేలు (mlas), ఇతర కార్పొరేషన్ పదవుల కోసం ఆశావ హులు అనేకమంది రేవంత్ వెంట అమెరికా వెళ్లడా నికి సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం.
సుమారు డజన్ మంది నాయకులు ఎయిర్ టికెట్లు బుక్ (Book air tickets) చేసుకుం టున్నారన్ని చర్చ వినిపిస్తుంది. రేవంత్ పర్సనల్ పీఆర్ టీమ్ కూడా భారీగానే ఉండబో తుందని సమాచారం. రేవంత్ టీమ్ డెక్కన్ క్రానికల్ ఎడిటర్ శ్రీరాం కర్రి పేరు ఇదివరకే ఖరారు అయ్యిందని, అయి తే ఆయనను ఏ హోదాలో గతంలో దావోస్ పర్యట నకు తీసు కెళ్లారంటూ ప్రశ్నిస్తూ సంబంధిత నోట్ ఫైల్ కాపీ (Note file copy)కావాలంటూ పలు మీడియా సంస్థల జర్నలిస్టులు సమాచార హక్కు చట్టం కింద సెక్రటేరియట్లో దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఆయన ఎంపికపై ప్రభుత్వం సీఎం సీపీఆర్వో బోరెడ్డి అయోధ్య రెడ్డి (CPRO Boreddy Ayodhya Reddy)సహా మరో ఇద్దరు ప్రభుత్వ సలహాదారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి వెంట అమె రికా వెళ్లే పనిలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది. మొత్తానికి ఈసారి రేవంత్ పర్యటనలో జంబో టీమ్ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
రాష్ట్ర ఖజానాకు ఖర్చు కూడా భారీగానే ఉంటుందని సచివాలయ వర్గాలు చెబు తున్నాయి. జూన్ నెలలో ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పర్యటనలో అనౌన్స్(announce) చేయకుండా ఆపిన నాలుగైదు పెట్టుబడుల ప్రకటనలు. కూడా ఈ దఫా సీఎ రేవంత్ రెడ్డి పర్యటనలో చేస్తారని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.